Payal Rajput: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్టేజిపై ఏడ్చేసిన హీరోయిన్.. అసలేమైందంటే?

నటి పాయల్ రాజ్‌పుత్ ‘ఫస్ట్ టైమ్’ ప్రమోషన్స్‌లో తండ్రి మరణాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ప్రశ్నకు స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకుని ఈవెంట్ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో వ్యక్తిగత విషయాలపై జాగ్రత్తగా ప్రశ్నలు అడగాలనే చర్చ మొదలైంది.

New Update
Payal Rajput

Payal Rajput

Payal Rajput: సినిమా రంగంలో నటీనటులు వెలుపల కనిపించేది ఒక కోణం మాత్రమే. కానీ వారి వ్యక్తిగత జీవితంలో వారు కూడా సాధారణ మనుషుల్లానే భావోద్వేగాలు అనుభవిస్తారు. ఇటీవల నటి పాయల్ రాజ్‌పుత్ Payal Rajput ఒక కార్యక్రమంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ఫస్ట్ టైమ్ (01-01-01)’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

Payal Rajput Emotional on Stage

Also Read: ’కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఈ కార్యక్రమంలో ఒక విలేకరి ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా ఆమె తండ్రి గురించి ప్రస్తావించడంతో పాయల్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మరణించారని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆమె మాట్లాడుతూ, తన జీవితంలో తండ్రి ఎంతో ముఖ్యమని చెప్పారు. తన సినిమాలకు ఆయనే పెద్ద విమర్శకుడని, తనపై ఎప్పుడూ గర్వపడేవారని చెప్పారు. ఆ కష్టకాలంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక చాలా బాధపడ్డానని తెలిపారు.

Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!

అలాగే తాను జైపూర్‌లో విపాసన చికిత్స తీసుకున్నానని చెప్పారు. ఆ సమయంలో యోగా వంటి సాధనలతోనే తాను మళ్లీ కోలుకున్నానని వివరించారు. కానీ ఆ విషయాలను గుర్తుచేసుకుంటూ స్టేజ్‌పై ఎక్కువ సేపు ఉండలేకపోయారు. మూవీ టీమ్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించినా, ఆమె భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

ఈ ఘటనతో మరోసారి మీడియా ప్రశ్నలు అడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చర్చ మొదలైంది. నటీనటులు కూడా మనుషులే కాబట్టి, వారి వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు అడిగేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ‘ఫస్ట్ టైమ్’ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో పాయల్ బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ హీరోగా నటిస్తున్నారు. హేమంత్ ఇప్పలపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
తాజా కథనాలు