ఆ స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ.. 2029 ఎన్నికలే టార్గట్ : నాగవంశీ

నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తమ బ్యానర్ నుంచి వచ్చే తదుపరి సినిమాల గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాది ఒక పెద్ద స్టార్ హీరోతో పొలిటికల్ సినిమా చేస్తున్నాం. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఉంటుందని అన్నారు.

New Update
vv

టాలీవుడ్ లో DJ టిల్లు, సార్, మ్యాడ్, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అందుకుని అగ్ర నిర్మాణ సంస్థలకు పోటీ ఇస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ పొలిటికల్ మూవీ తెరకెక్కనుందట. ఈ విషయాన్నీ సితార అధినేత సూర్యదేవర నాగవంశీ స్వయంగా వెల్లడించారు. 

2029 ఎన్నికలే టార్గెట్ గా..

ఆయన నిర్మాతగా వ్యవహరించిన 'లక్కీ భాస్కర్' మూవీ దీపావళి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ." వచ్చే ఏడాది ఒక పెద్ద స్టార్ హీరోతో పొలిటికల్ సినిమా మొదలు పెడతాము. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా స్టార్ట్ చేస్తాం..' అని అన్నారు. 

Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'విశ్వం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

దీంతో సోషల్ మీడియాలో ఈ పొలిటికల్ మూవీ రియల్ లైఫ్ లో ఏ పొలిటీషియన్ ను బేస్ చేసుకొని వస్తుందా? అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీనిపై ముందు ముందు నాగవంశీ ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక లక్కీ భాస్కర్ విషయానికొస్తే.. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.12.7 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. దీపావళికి రిలీజైన సినిమాల్లో ఈ సినిమాకే హైయెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. 

Also Read : కమల్ హాసన్ రికార్డు బ్రేక్ చేసిన 'అమరన్'.. తొలిరోజే బాక్సాఫీస్ షేక్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రవస్తి ఆరోపణలు.. పాటతో కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత

సింగర్ సునీత ఇన్‌డైరెక్ట్‌గా ప్రవస్తిని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు అనే పాటను షేర్ చేశారు. ప్రవస్తి గురించే ఈ పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

New Update
singer pravasthi comments on Sunitha

singer pravasthi comments on Sunitha

గాయని ప్రవస్తి పాడుతా తీయగా షోలోని జడ్జిలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారికి నచ్చిన వారికే ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేస్తారని మిగతా వారిని తొక్కేస్తారని సింగర్ ప్రవస్తి కామెంట్లు చేసింది. అలాగే తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. అయితే దీనికి సింగర్ సునీత స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

కీరవాణి అందించిన పాటను..

ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రవస్తి గురించి డైరెక్ట్‌గా కాకుండా.. లిరిక్స్‌ను షేర్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన పాటను ఆమెను షేర్ చేశారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్‌ పాటను షేర్ చేశారు. అయితే సునతీ సింగర్ ప్రవస్తి గురించే పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదిలా ఉండగా పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో చాలా మంది సింగర్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే ఈ షోలో జడ్జెస్‌గా సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి ఆరోపణలు చేసింది. జడ్జిమెంట్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని, కొందరు పాడకపోయినా కూడా సపోర్ట్ చేస్తూ.. చివరి వరకు తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై సింగర్ సునీత కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పలుమార్లు విమర్శలు చేయడంతో ఈ వీడియోను షేర్ చేశారు. 

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

Advertisment
Advertisment
Advertisment