నెలలోనే ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రఘుతాత'..! కారణం ఇదేనా..? కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రఘుతాత'. తమిళంలో ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ రిజల్ట్స్ కారణంగా నెలలోనే ఓటీటీలోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 10 Sep 2024 | నవీకరించబడింది పై 10 Sep 2024 10:04 IST in సినిమా Latest News In Telugu New Update Raghu Thatha షేర్ చేయండి Raghu Thatha: నేషనల్ అవార్డు విన్నర్ నటి కీర్తి సురేష్ లీడ్ రోల్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ 'రఘుతాత'. ఆగస్టు 15న తమిళంలో గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక థియేటర్ రిజల్ట్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో రిలీజైన నెలలోనే ఓటీటీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఓటీటీ డేట్, స్ట్రీమింగ్ ప్లాట్ లాక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తెలుగులో థియేట్రికల్ రిలీజ్ లేకుండానే ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం. రఘుతాత ఓటీటీ స్ట్రీమింగ్ తమిళంలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో మూడు భాషల్లో రాబోతుంది. రఘుతాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో సెప్టెంబర్ 13నుంచి స్ట్రీమింగ్ కానుంది. “కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ బ్లాక్బస్టర్ కోసం రెడీగా ఉండండి అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ముందుకు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ థియేటర్ రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకొని ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Get ready for a hilarious family blockbuster!😂💥#RaghuThatha will be streaming from September 13th only on ZEE5 in Tamil, Telugu, and Kannada.@KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh @tejlabani @mdeii… pic.twitter.com/DpCcA8XfAA — ZEE5 Tamil (@ZEE5Tamil) September 9, 2024 హిందీ వ్యతిరేక ఉద్యమం హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తితో పాటు రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాజీవ్ రవీంద్రనాథన్, ఎంఎస్ భాస్కర, దేవదర్శిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సీన్ రొనాల్డన్ సంగీతం అందించారు. 1960 బ్యాక్ డ్రాప్ లో హిందీ వ్యతిరేక ఉద్యమం అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం కీర్తి తెలుగులో 'ఉప్పుకప్పురంబు', తమిళంలో 'రివోల్టార్ రీటా' అనే చిత్రాల్లో నటిస్తోంది. మరో వైపు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన 'బేబీ జాన్' చేస్తోంది. సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి