'సత్యం సుందరం' తో వచ్చేస్తున్న కార్తీ. అరవింద్ స్వామి!

కోలీవుడ్ స్టార్ కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'మెయ్యళగన్‌'. తెలుగులో ‘స‌త్యం సుంద‌రం’ పేరుతో విడుదల కాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇద్దరు స్నేహితుల కథాంశంతో సాగిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

New Update

Sathyam Sundaram:  కోలీవుడ్ స్టార్ కార్తీ (Hero Karthi), అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్  ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ 'మెయ్యళగన్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో ‘స‌త్యం సుంద‌రం’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. కార్తీ హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్ టైన్మెంట్స్ పై హీరో సూర్య-జ్యోతిక నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ సీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 28న తెలుగులో విడుదల కాగా,  27న తమిళంలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

‘స‌త్యం సుంద‌రం’ ట్రైలర్ 

ఇద్దరి స్నేహితుల కథాంశంతో సరదాగా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో కార్తీ,అరవింద్‌స్వామి  మధ్య ఎమోషనల్ సీన్స్ , కామెడీ హైలైట్ గా నిలిచాయి. మరోవైపు ట్రైలర్ లోని సీరీయస్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.  ఈ చిత్రంలో రాజ్ కిర‌ణ్, శ్రీదివ్య, స్వాతి, దేవదర్శిణి, జయప్రకాశ్‌, శ్రీరంజిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. 96ఫ్రేమ్ గోవింద్ వసంత్ సంగీతం అందించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు