జానీ మాస్టర్ వైఫ్‌ అయేషా సంచలన నిర్ణయం

జానీ మాస్టర్ భార్య అయేషా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ పెద్దలను కలిసి మద్దతు కోరేందుకు సిద్ధమయ్యారు. రేపు డైరెక్టర్ సుకుమార్‌ను, డ్యాన్స్‌ అసోసియేషన్‌ సభ్యులను కలిసి మాట్లాడనున్నారు. తన భర్తపై కుట్ర చేసి కేసు పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు.

New Update
jani wife

Jani Master: జానీ మాస్టర్ భార్య అయేషా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ పెద్దలను కలిసి మద్దతు కూడగట్టాని సిద్ధమయ్యారు. రేపు డైరెక్టర్ సుకుమార్‌ను, డ్యాన్స్‌ అసోసియేషన్‌ సభ్యులను కలిసి మాట్లాడనున్నారు. తన భర్తపై కుట్ర చేసి కేసు పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. కాగా నిన్న జానీ మాస్టర్ బాధితురాలిని పలుమార్లు అత్యాచారం చేసినట్లు స్టేట్‌మెంట్ ఇచ్చారని నార్సింగి పోలీసులకు చెప్పిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. ప్రస్తుతం అతను చర్లపల్లి జైలులో ఉన్నాడు. 

ఇది పెద్ద కుట్ర..

కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌.. డ్యాన్సర్‌పై లైంగిక ఆరోపణల మీద ఆయన భార్య అయేషా RTV తో మాట్లాడారు. ఈ మేరకు ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. తన భర్త అరెస్ట్ వెనక పెద్ద కుట్ర జరుగుతోందని, ఆ అమ్మాయి ఎలాగైనా టాప్ పొజిషన్ కి వెళ్లాలని ఇలా చేసిందని, ఈ విషయంలో ఆమెకు తన పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉందని చెప్పారు. 

ఆమె ఒక సైకో...

ఇది పూర్తిగా తప్పుడు కేసు, కానీ దీన్నిపకడ్బందీగా చేస్తున్నారని అన్నారు. ఆ అమ్మాయి ఓక సైకో అని ఫైర్ అయ్యారు. ఈ రోజు ఆమెకి సపోర్ట్ చేసిన వాళ్లపైనే మళ్ళీ కేసు పెడుతుంది. ఆమెకు డ్యాన్స్ మాస్టర్ కార్డు రాకపోతే జానీ.. యూనియన్ తో ఫైట్ చేసి మరీ ఇప్పించారు. తనే మాస్టర్ ను ఇష్టపడింది. ఆ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలని కోరిక. తన కెరీర్ కోసం జానీ మాస్టర్ ను వాడుకుందని ఆరోపణలు చేశారు.

చాలాసార్లు ఆమెతో పాటూ వాళ్ళ మదర్ కూడా మా ఇంటికి వచ్చింది. వాళ్ళ మదర్ మాట్లాడిన ఆడియోలు కూడా ఉన్నాయి. అవి ఎవరికి ఇవ్వాలో వాళ్లకే ఇస్తా   బయట ఇంత జరుగుతున్నా.. ఆ అమ్మాయి తల్లి ఎందుకు మాట్లాడటం లేదు' అంటూ చెప్పారు. పూర్తి సమాచారం కోసం ఫుల్ ఇంటర్వ్యూ చూడండి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు