/rtv/media/media_files/2026/03/17/janhvi-kapoor-2026-03-17-13-15-36.jpg)
Janhvi Kapoor
Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవికి చెందిన ఒక భూమి వివాదం ప్రస్తుతం మద్రాస్ హైకోర్టుకు చేరింది. చెంగల్పట్టు ప్రాంతంలో ఉన్న సుమారు 4.7 ఎకరాల స్థలంపై హక్కుల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసును పరిశీలించిన జస్టిస్ టి.వి. తమిళ్సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం, తదుపరి చర్యలపై తాత్కాలికంగా స్టే విధించింది. ఈ కేసు విచారణను మార్చి 26 వరకు వాయిదా వేసింది.
Film Producer Boney Kapoor and his daughters, Janhvi and Kushi Kapoor, have approached the Madras High Court against an order of the Additional District Judge, Chengalpattu, refusing to reject a plaint filed in connection with the late actor Sridevi's property near the East Coast… pic.twitter.com/TmbQYsJzRw
— Live Law (@LiveLawIndia) March 17, 2026
ఈ వివాదం మొదలైన కారణం 1988లో జరిగిన భూమి కొనుగోలు. ఆ సమయంలో ఈస్ట్ కోస్ట్ రోడ్ సమీపంలో ఉన్న ఈ భూమిని శ్రీదేవి అన్ని పత్రాలు సరిచూసుకుని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఆ భూమిపై తమకే హక్కు ఉందని చెబుతూ మొదలియార్ కుటుంబానికి చెందిన కొంతమంది కోర్టులో కేసు వేశారు.
ఈ కేసు ప్రస్తుతం చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో కొనసాగుతోంది. చాలా కాలంగా ఈ వివాదం పరిష్కారం కాలేదు. దీంతో బోనీ కపూర్ కుటుంబం ఈ కేసును హైకోర్టుకు తీసుకెళ్లింది.
తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు సరిగానే ఉన్నాయని, ఈ కేసును రద్దు చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టులో కీలక దశకు చేరింది. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ ఈ నెల 26న జరగనుంది.
Follow Us