New Update
/rtv/media/media_files/2025/03/19/CJEYcTOY7Ijn9Qmg2iG8.jpg)
Lucifer 2
Lucifer 2: మోహన్లాల్(Mohanlal) హీరోగా తెరకెక్కుతున్న మూవీ "లూసిఫర్ 2: ఎంపురాన్" పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, పృథ్వీరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు. ఆ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్గా మారింది.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
ఎప్పటికీ రజినీ అభిమానిని..
అయితే, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల "లూసిఫర్ 2: ఎంపురాన్" ట్రైలర్ను రజనీకాంత్కు చూపించారు. రజినీకాంత్ ఫ్యాన్ గా ఈ జ్ఞాపకాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటా అని పృథ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా పృథ్విరాజ్ మాట్లాడుతూ.. "నేను 'లూసిఫర్ 2: ఎంపురాన్' ట్రైలర్ను మొదట రజినీకాంత్ కు చూపించాను. ఆయన ఈ వీడియో చూసి చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. ఎప్పటికీ నేను ఆయన అభిమానిని" అని పేర్కొన్నారు.
గతంలో కూడా రజనీకాంత్పై తన అభిమానాన్ని పృథ్వీరాజ్ చాలా సార్లు ప్రకటించారు. తాను రజినీకాంత్ తో మూవీ తీసేందుకు చాలా ఎదురుచూసానాని, కానీ డేట్స్ కుదరక ఆ అవకాశం దక్కలేదని తెలిపారు. అయితే ‘లూసిఫర్2’ మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. 2019 లో వచ్చిన లూసిఫర్ కు సీక్వెల్ గా ‘లూసిఫర్2’ రూపొందింది.
తాజా కథనాలు