/rtv/media/media_files/2026/05/31/adarsha-kutumbam-2026-05-31-10-18-25.jpg)
Adarsha Kutumbam
Adarsha Kutumbam: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో విక్టరీ వెంకటేష్ కలిసి చేస్తున్న కొత్త సినిమా ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47) పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి ఉంది. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి విజయవంతమైన చిత్రాలకు త్రివిక్రమ్ డైలాగులు అందించగా, ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి కలిసి పని చేస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. హైదరాబాద్లో ఇప్పటికే షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ ద్వారా గుర్తింపు పొందిన నటి దేవయాని శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
దేవయాని శర్మ కెరీర్లో ఇది ఒక ముఖ్యమైన అవకాశం అని చెప్పొచ్చు. ఆమె ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించబోతుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక దేవయాని శర్మ తదుపరి విడుదల ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’. ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. జూన్ 19, 2026 నుంచి జియోహాట్స్టార్లో ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా కుటుంబ ప్రేక్షకులను నవ్వించే వినోదాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు.
సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Follow Us