Bharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'!

గత కొంతకాలం నుంచి జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదుల చర్యలు ఎక్కువ అయ్యాయి.భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెలి కమ్యూనికేషన్‌ అల్ట్రాసెట్‌ దొరకడంతో పరిస్థితులు విషమంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

New Update
Bharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'!

China Made Ultra Set : గత కొంతకాలం నుంచి జమ్మూ కశ్మీర్‌ (Jammu & Kashmir) లో ఉగ్రవాదుల (Terrorists) చర్యలు ఎక్కువ అయ్యాయి. అతి తక్కువ కాలంలోనే పలు ఉగ్రదాడులు జరిగాయి. అయితే భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెలి కమ్యూనికేషన్‌ అల్ట్రాసెట్‌ దొరకడంతో పరిస్థితులు విషమంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

ఈ అల్ట్రాసెట్‌ అనేది చైనా (China) తయారీ కమ్యూనికేషన్ పరికరం కావడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ పరికరాలను చైనా… పాక్ సైన్యానికి అందించింది. వీటి ద్వారా శత్రు దేశాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలకు దొరక్కుండా సమాచారం మార్చుకోవచ్చు. ఇప్పుడీ అల్ట్రా సెట్ పరికరాలు ఉగ్రవాదుల చేతుల్లోకి రావడం భారత భద్రతా బలగాలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఏప్రిల్ 25న జమ్మూకశ్మీర్ లోని సోపోర్ లో ఇద్దరు టెర్రరిస్తులు భద్రతబలగాల చేతిలో హతం కాగా… పూంచ్ జిల్లా ఎన్ కౌంటర్ లో మరో నలుగురు విదేశీ మిలిటెంట్లు మృతి చెందారు. ఈ ఆరుగురి వద్ద అల్ట్రా సెట్లు (Ultra Sets) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Also read: నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్క్ శంకర్‌ను కాపాడిన సింగపూర్ స్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. పవన్‌‌తో మోదీ మాట్లాడి.. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

author-image
By K Mohan
New Update
PM modi pK

PM modi pK Photograph: (PM modi pK)

సింగపూర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక సమాచారాన్ని వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ కూడా పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేసి మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి, బాబు ఆరోగ్య పరిస్దితి గురించి మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో పవన్‌ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి 7గంటలకు ఫ్లైట్‌లో సింగపూర్ బయలుదేరనున్నారు.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడికి చికిత్స కొనసాగుతోందని జనసేన లీడర్ తెలిపారు. జరిగిన ప్రమాదంపై పవన్‌ కళ్యాణ్‌తో మోదీ మాట్లాడారని ఆయన చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాని మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Also read: Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment