చంద్రమోహన్ అంత్యక్రియలు మరింత ఆలస్యం.. కారణమిదే?

New Update
చంద్రమోహన్ అంత్యక్రియలు మరింత ఆలస్యం.. కారణమిదే?

శనివారం ఉదయం కన్నుమూసిన నటుడు చంద్రమోహన్‌ను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ మేరకు సోమవారం వరకూ ఆయన పార్థివదేహం సందర్శనార్థం ఫిలింనగర్‌లోని ఆయన ఇంటి వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికాలో ఉంటున్న చంద్రమోహన్ ఒక కూతురు రావడానికి రెండురోజులు పడుతుందని, ఆమె వచ్చిన తర్వాతే సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు సన్నిహితులు తెలిపారు. చెప్పారు. దీపావళి పండగ సందర్భంగా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఫిలిం ఛాంబర్‌లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచట్లేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

Also Read: ఆ చిన్న కారణంతో రూ.100 కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. ఎందుకో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు