CM CBN : ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు బాబు ఆదేశాలు! ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. By Bhavana 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేసి బాధ్యతలు చేపట్టిన టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తన కేబినెట్ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాల గురించి బాబు స్వయంగా వివరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాబు దిశానిర్దేశం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు తేడాలు వివరించారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ (YCP) ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని ఇప్పటి ప్రభుత్వంలోకి చేర్చుకోవద్దని తెలిపారు. రాష్ట్రంలో జగన్ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాల్సి ఉందని బాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని అన్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం అని వివరించారు. ఇక, మంత్రులు ఇష్టాయిష్టాలు, వారి సమర్థత మేరకు గురువారం లోగా శాఖలు కేటాయిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అని బాబు మంత్రులకు స్పష్టం చేశారు. Also read: రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ! #ap-cm-chandrababu #new-govt #ministers #tdp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి