Nitin Gadkari: నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన
AP: నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. నేషనల్ హైవే ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. అనంతరం మదనపల్లిలో పర్యటిస్తారు. రాత్రి తిరుమలలో బస చేయనున్నారు.
Nitin Gadkari:ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆదినాథ్ శ్రీగురు మహావతార్ బాబాజీ ఆలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు ఆయన తిరుపతి నుంచి హెలికాప్టర్లో మదనపల్లెకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటల వరకు సత్సంగ్ ఆశ్రమంలో పర్యటించిన అనంతరం బాబాజీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. రాత్రి 8 గంటలకు తిరుపతికి తిరుగు ప్రయాణం కానున్నారు.
Aghori: చంచల్గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్గూడ జైలుకు తరలించి.. ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..
ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్కు పంపించారు.
లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.