Nitin Gadkari: నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

AP: నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. నేషనల్‌ హైవే ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. అనంతరం మదనపల్లిలో పర్యటిస్తారు. రాత్రి తిరుమలలో బస చేయనున్నారు.

New Update
Nitin Gadkari: నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

Nitin Gadkari: ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. సత్సంగ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఆదినాథ్‌ శ్రీగురు మహావతార్‌ బాబాజీ ఆలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు ఆయన తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో మదనపల్లెకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటల వరకు సత్సంగ్‌ ఆశ్రమంలో పర్యటించిన అనంతరం బాబాజీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. రాత్రి 8 గంటలకు తిరుపతికి తిరుగు ప్రయాణం కానున్నారు.

Also Read: ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు