Telangana Assembly Meet: అసెంబ్లీ వద్ద హైటెన్షన్ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, BRS ఎమ్మెల్యేలు నడుమ వాగ్వాదం నడించింది. By V.J Reddy 14 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana Assembly Meet: అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం వాడి వేడిగా సాగుతోంది. మేడిగడ్డ, KRMB పై చర్చ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల్ని పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో బయట మాట్లాడకూడదు అనే నిబంధన ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులు తెలిపారు. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్, హరీష్ వాగ్వాదానికి దిగారు. లోపల ఆంక్షలే, బయట ఆంక్షలేనా అంటూ హరీష్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్, హరీష్ నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. NEWS IS BEING UPDATED #telangana-assembly-meet #brs-mlas #ktr #harish-rao సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి