MLA Harish Rao: హైడ్రా అధికారులకు హరీష్ రావు స్వీట్ వార్నింగ్! TG: హైడ్రాను రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా హైడ్రా పనిచేస్తోందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్ని అనుమతులతో కాలేజీలు నిర్మించారని.. చర్యలు తీసుకునే ముందు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 25 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి MLA Harish Rao: కాంగ్రెస్ తీసుకొచ్చిన హైడ్రాపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఫైర్ అయ్యారు. అయితే కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేదంటే టార్గెట్ చేస్తాం అన్నట్లుగా పాలన ఉందని విమర్శించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరు కేసులు పెట్టారని.. మానసికంగా, పొలిటికల్ గా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ పని చేస్తోందని ఆరోపణలు చేశారు. హైడ్రాను రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్నారని అన్నారు. హైడ్రా పేరుతో రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్ని అనుమతులు తీసుకునే కాలేజీలు నిర్మించారని తేల్చి చెప్పారు. పల్లాపై రాజకీయ కుట్రతోనే 6 కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. హైడ్రాకు తాను వ్యతిరేకం కాదని, నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని అన్నారు. Also Read : నల్గొండ జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు #mla-harish-rao సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి