గెట్ రెడీ.. ఓటీటీ ప్రేక్షకులకు డబుల్ బొనాంజా

ఓటీటీ ప్రేక్షకులకు వచ్చే వారం పుల్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది. థియేటర్‌లో మిస్ అయిన మూవీలు మీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. డిజిటల్ ఫ్లాట్‌ఫాం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రో, బేబీ మూవీలు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి.

New Update
గెట్ రెడీ.. ఓటీటీ ప్రేక్షకులకు డబుల్ బొనాంజా

ఓటీటీ ప్రేక్షకులకు వచ్చే వారం పుల్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది. డిజిటల్ ఫ్లాట్‌ఫాం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ 'బ్రో' మూవీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. మెగా మేనల్లుడు సాయితేజుతో కలిసి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో.. ది అవతార్' సినిమా ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు రాబట్టి పవన్ స్టామినా చూపించింది. బ్రో ఓటీటీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో వారికి నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది.

సినిమా విడుదలై నెల రోజులు అవుతున్న సందర్భంగా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 25న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కాన్నునట్లు ఆ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. తొలుత ఈ సినిమాను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే వారం రోజుల ముందే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. వినోదాయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. జీస్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. కేతిక శర్మ హీరోయిన్‌గా, ప్రియాంక వారియర్‌.. తేజు చెల్లెలుగా నటించారు.

ఇక చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టి బేబీ మూవీ కూడా ఓటీటీలోకి విడుదలకు సిద్ధమైంది. గత నెల జులై 14న విడుదలై కల్ట్ క్లాసిక్‌గా బేబీ మూవీ నిలిచిపోయింది. . "మరోసారి కల్ట్ లవ్ స్టోరీ ఆఫ్ ద డెకేడ్ చూడటానికి సిద్ధంగా ఉండండి. బేబీ మూవీ మిమ్మల్ని ప్రేమలో పడేలా చేస్తుంది. కోపం తెప్పిస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ 25న స్ట్రీమ్ అవుతుంది. అంత వరకూ ఆగలేకపోతే వెంటనే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. 12 గంటల ముందే ఈ సినిమా చూసేయండి" అని ఆహా రెండు రోజుల ముందే ట్వీట్ చేసింది. ఈ మూవీని ఆగస్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. సాయిరాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. దాదాపు రూ.90కోట్ల వరకు వసూళ్లు రాబట్టి బ్లాక్‌బాస్టర్ సినిమాగా నిలిచింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు