Brahmamudi Serial: అప్పు కోసం రోడ్డెక్కిన కళ్యాణ్..! కోపంతో రగిలిపోతున్న అనామిక, ధాన్యలక్ష్మి.. కావ్య కుటుంబానికి అవమానం

అప్పు కోసం బ్రోకర్ ను కొడతాడు కళ్యాణ్. ఇది తెలిసిన ధాన్యలక్ష్మి, అనామిక ఇంట్లో పంచాయితీ పెడతారు. అప్పు తన కొడుకుతో తిరుగుతుందని కనకం, కృష్ణమూర్తిని అవమానిస్తారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: అప్పు కోసం రోడ్డెక్కిన కళ్యాణ్..! కోపంతో రగిలిపోతున్న అనామిక, ధాన్యలక్ష్మి.. కావ్య కుటుంబానికి అవమానం

Brahmamudi Serial: పోలీస్ ఉద్యోగ్యం కావాలంటే తనకు ఫెవర్ చేయాలనీ అప్పుతో మిస్ బెహేవ్ చేస్తాడు బ్రోకర్. అప్పు ద్వారా ఈ నిజం తెలుసుకున్న కళ్యాణ్ అందరి ముందు వాడి నిజస్వరూపం బయటపెట్టాలని అప్పును తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. పోలీసులు, మీడియా ముందు వాడిని కొట్టి.. బుద్ది చెప్తాడు. publive-image
కళ్యాణ్ ఆ బ్రోకర్ ను కొట్టడం మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసి రుద్రాణి .. ధాన్యలక్ష్మిని రెచ్చగోట్టడానికి మంచి ఛాన్స్ దొరికిందని ఎంజాయ్ చేస్తుంది.

publive-image

ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లిన రుద్రాణి.. కళ్యాణ్ రోడ్డెక్కి గొడవపడుతున్నాడని ఆ వీడియోను చూపిస్తుంది. ఆ అప్పు వల్లే కళ్యాణ్ రోడ్డెక్కి గొడవ పడుతున్నాడని ధాన్యలక్ష్మిని మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి.

publive-image
రుద్రాణి మాటలతో రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి.. చూస్తూ కూర్చుంటే లాభం లేదు అందరి ముందు ఆ కనకాన్ని కడిగిపారేస్తా అని అంటుంది. వెంటనే కనకంకు ఫోన్ చేసి అప్పును తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తుంది.

publive-image
కొడుకు చేసిన పనికి రగిలిపోతున్న అనామిక, ధాన్యలక్ష్మి ఇంట్లో పంచాయితీ పెడతారు. కనకం, కృష్ణమూర్తి కూడా వస్తారు. ఇక వాళ్ళు రాగానే మాటల యుద్ధం మొదలు పెడుతుంది ధాన్యలక్ష్మి. అప్పు నా కొడుకుతో తిరుగుతుంది.. తిరగడమే కాదు వాడిని ఒక వీధి రౌడీని చేసింది అని సీరియస్ అవుతుంది. ఇంటికి వచ్చి కూడా వార్నింగ్ ఇచ్చాను. అయినా సరే మీకు బుద్ది, జ్ఞానం లేవా అని కనకాన్ని అవమానిస్తుంది.

publive-image
ఇంతలో అక్కడికి వచ్చిన కళ్యాణ్.. వాడు అప్పుతో మిస్ బిహేవ్ చేశాడు అందుకే కొట్టానని సమర్థిస్తాడు. దీంతో అనామిక.. ఆపు కళ్యాణ్..! అప్పు నీతో సిగ్గు లేకుండా తిరుగుతుంది.. మళ్ళీ దానికి ఫ్రెండ్షిప్ అనే పెట్టుకున్నారు అని భర్త పై సీరియస్ అవుతుంది. ఆ తర్వాత కనకం అప్పును తీసుకొని వెళ్ళిపోతుంది.

publive-image
మరో వైపు కావ్య బాబు తల్లి వెన్నెల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వచ్చిన ఇందిరాదేవి.. వెళ్లిన పని ఏమైందని అడుగుతుంది. దీంతో కావ్య.. ఆ వెన్నెల 10 ఏళ్ల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందట అని నిరాశ పడుతుంది. అప్పుడే వచ్చిన కళ్యాణ్ వెన్నెలను వెతకడంలో తాను సహాయం చేస్తానని వదినకు దైర్యం చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Pooja Hegde: పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు