TS: నీకో లక్ష.. బిడ్డకో లక్ష.. ప్రియురాలిని వంచించి.. పెళ్లికి నో చెప్పిన ప్రియుడు..! భద్రాద్రి జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏడాదికాలంగా సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రయ్యాడు. తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. తల్లి, బిడ్డకు చేరో లక్ష ఇస్తా కానీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. By Jyoshna Sappogula 14 Aug 2024 in క్రైం ఖమ్మం New Update షేర్ చేయండి Khammam: ప్రేమపేరుతో ప్రియురాలిని వంచించాడు ఓ ప్రియుడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏడాదికాలంగా సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఆ తరువాత మొఖం చాటేస్తూ పెళ్లికి నిరాకరించాడు. యువతి తన పెద్దలతో పంచాయితీ పెట్టిస్తే.. ప్రియురాలికి, పుట్టిన బిడ్డకు కలిపి రెండు లక్షలు చెల్లిస్తాను తప్పా పెళ్లి మాత్రం చేసుకోలేనని తేల్చిచెప్పాడు. ఈ దారుణమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. Also Read: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్.. వివాదంలోకి మరో కొత్త వ్యక్తి ఎంట్రీ! కొత్తగూడెం పట్టణం బర్మాక్యాంపునకు చెందిన బెజ్జి ఝాన్సీని బదావత్ తండాకు చెందిన భగవత్ పవన్ అనే యువకుడు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏడాదికాలంగా ఝాన్సీతో సహజీవనం చేయగా యువతి గర్భం దాల్చింది. దీంతో తనను వివాహం చేసుకోవాలని ఝాన్సీ పలుమార్లు ఒత్తిడి చేసింది. అయితే, ఇంట్లో వాళ్లని ఒప్పించాలంటూ ప్రియుడు పవన్ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఇటీవల ఝాన్సీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలియడంతో ప్రియుడు పవన్ మొఖం చాటేశాడు. Also Read: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా? దీంతో ఝాన్సీ తనకు న్యాయం కావాలంటూ పెద్దమనుషులతో పంచాయితీ పెట్టించింది. ప్రియురాలికి, పుట్టిన బిడ్డకు కలిపి రెండులక్షలు చెల్లిస్తానని.. పెళ్లి మాత్రం చేసుకోలేనని ప్రియుడు పవన్ తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలు ఝాన్సీ కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. తనకు పవన్ తో వివాహం జరిపించి న్యాయం చేయాలని ఝాన్సీ కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రియుడు పవన్ ను అదుపులోకి తీసుకున్నారు. #khammam సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి