AP News: మేము ఒక పిలుపు ఇస్తే ఖతమే.. దాడులపై బోత్స సంచలన కామెంట్స్!

ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో టీడీపీ.. వైసీపీ మీద దాడులకు తెగబడుతోందన్నారు. మేము ఒక పిలుపు ఇస్తే క్లోజ్. కానీ సంయమనం పాటిస్తున్నామని చెప్పారు.

New Update
Botsa Satyanarayana: వెనుకంజ‌లో బొత్స సత్యనారాయణ.!

AP News: ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో వైసీపీ మీద టీడీపీ దాడులకు తెగబడుతోందన్నారు. హింసాత్మక ఘటనలు ఎవరి మీద జరుగుతున్నాయో మీరే చూడండి. జరుగుతున్న దాడులు చూస్తుంటే ఎవరు ఓటమి భయంతో వున్నారో అర్థం అవుతుంది. మేము ఒక పిలుపు ఇస్తే క్లోజ్. కానీ చాలా ఓపిక పడుతున్నాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడిన బొత్స.. సీఎం జగన్ విదేశాలకు వెళ్ళాలనేది ఎన్నికల ముందే నిర్ణయం జరిగింది. విద్యావ్యవస్థకు సంబంధించిన మీటింగ్ ఒకటి వుంటుంది. ఎన్నికల ముందు షెడ్యుల్ చెబితే ఎన్నికలకు ముడిపెడతారని ప్రకటించలేదు. ఇప్పుడు సీఎం టూర్ ప్రయివేట్ ట్రిప్ గా వుండాలా. మీటింగ్ పెట్టాలా అనేది ఆలోచిస్తున్నాం. మేం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు కష్టోడియన్ గా ఉండాలి అనుకుంటున్నాం తప్పా.. కేంద్రంలో అధికారంలో వుండే పార్టీకి కాదనేది మా విధానం. ఫ్రెండ్స్ కనుకనే పీఎం మోడీ నామినేషన్ కు పవన్, చంద్రబాబు వెళ్లి వుండవచ్చు. ఏపీలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని చంద్రబాబు చెప్పింది నిజమే. టీడీపీకి గతంలో వచ్చిన 23కూడా ఇప్పుడు రావు అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు