AP: క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు రాత్రంతా...

పల్నాడు జిల్లా చిన తురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తోన్నాయి. గ్రామంలో ఇంటి తలుపులు, గోడలకు, చెట్లకు మేకులు కొట్టి ఎర్రగుడ్డలో మంత్రించిన నిమ్మకాయలను దుండగులు ఇంటి ముందు పడేస్తున్నారు. భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు క్షుద్రపూజల భయంతో రాత్రంతా జాగారం చేస్తున్నారు.

New Update
AP: క్షుద్రపూజల కలకలం..  భయాందోళనలో గ్రామస్తులు రాత్రంతా...

Guntur: పల్నాడు జిల్లా చిన తురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తోన్నాయి. గ్రామంలో ఇంటి తలుపులు, గోడలకు, చెట్లకు మేకులు కొట్టి ఎర్రగుడ్డలో మంత్రించిన నిమ్మకాయలను దుండగులు ఇంటి ముందు పడేస్తున్నారు. చిన్నపిల్లలకు చేతబడి చేసేందుకు రోడ్ల మీద బిస్కెట్లు వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Also Read: వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు!

భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు 15 రోజుల నుండి ఇదే పరిస్థితి ఉండడంతో రాత్రి సమయంలో ఊరికి పహారా కాస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లతో కలిసి రాత్రంతా జాగారం చేస్తున్నారు. క్షుద్రపూజల భయంతో గ్రామంలోకి ఇతరులను రానివ్వని పరిస్థితి కనిపిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు