Black Magic : కాకినాడలో క్షుద్రపూజలు కలకలం.. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..!

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా విచిత్రమైన శబ్దాలు చేస్తూ క్షుద్రపూజలు చేస్తున్నాడంటూ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

New Update
Black Magic : కాకినాడలో క్షుద్రపూజలు కలకలం.. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..!

Black Magic In Kakinada : కాకినాడ(Kakinada) జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజ(Black Magic) లతో ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచారం గ్రామంలో కలకలం రేపుతోంది. గత నెల 29వ తేదీన గ్రామంలోని ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించడంతో మొదలైన అలజడి ఇప్పటికీ గ్రామంలో కొనసాగుతోంది. ఊళ్ళో ఉన్న శివాలయం సమీపంలో ఓ వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా .. విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాడని గ్రామంలో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు.

Also Read : అనపర్తిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 1000 మంది..!

చీకటి పడితే ఒంటరిగా బయటకు వచ్చేందుకు కూడా ఎవరు సాహసించడం లేదు. ఆ శబ్దాలు చేస్తున్న వ్యక్తి కోసం రాత్రుళ్ళు గ్రామంలోని యువకులు విధుల్లో కర్రలు పట్టుకుని కాపలా కాస్తున్నారు. ఒంటిపై బట్టలు లేని వ్యక్తి మాకు కనిపించాడు అంటే మాకు కనిపించాడు అని మహిళలు బెంబెలెత్తిపోతున్నారు. దీనికి తోడు ఈ నెల మూడవ తేదీన గ్రామంలోని ఒక మేక తల, కాళ్ళు, పొట్ట భాగాలు వదిలేసి గుర్తు తెలియని వ్యక్తి జంతువును తినేయడం గ్రామంలో సంచలనం రేకెత్తించింది. అయితే గ్రామస్తుల భయాన్ని పోగెట్టెందుకు గ్రామ పెద్దలు గ్రామ దేవత నూకాలమ్మ ఆలయం(Nookalamma Temple) వద్ద దుష్ట శక్తుల భయం పోగ్గొట్టెందుకు పురోహితులు ఆధ్వర్యంలో కాల బైరవ సహిత అష్ట దిగ్బంధన మహా చండి యాగం నిర్వహించారు.

Also Read: సమస్యను పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తా: కొలికపూడి శ్రీనివాసరావు

శుక్రవారం అమావాస్య కావడంతో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం వలన గ్రామంలోని దుష్ట శక్తులు తొలగిపోతాయని ఇందుకోసం గ్రామంలోని ప్రతి ఇంటి ముందు నూనె దీపం వెలిగించి రాత్రంతా జాగారం చెయ్యాలని చెప్పడంతో  గ్రామంలోని ప్రజలు పడుకోకుండా మెలుకువగా కూర్చున్నారు. అయితే ఆ వ్యక్తిని చూశామని కొందరు చెబుతుంటే వింత శబ్దాలు, నవ్వులు, ఏడుపులు విన్నామని మరికొందరు చెబుతున్నారు. గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం పూజలు నిర్వహిస్తున్నామని వారిలో భయాలు తోలగెల అధికారులు అవగాహన కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.

New Update
ap cabinet

ap cabinet Photograph: (ap cabinet)

అమెరికాల టారిఫ్ ల భారం ప్రభావం ఏపీపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే మత్స్య ఉత్పత్తులపై 27 శాతం ఇంపోర్ట్ టారిఫ్‌ను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులకు చాలా గట్టిగా తగిలింది. దీంతో తాము చాలా నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిషయం గురించి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతులు, వ్యాపారులు, హేచరీలు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి కేంద్రంతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమని, ఆక్వా రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు సూచించారు. 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని కోరారు. ఆక్వా రంగం సమస్యల పరిష్కారం కోసం 11 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

సుంకాల భారం నుంచి బయటపడటానికి, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలో ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు.. మొత్తం 11 మంది ఉంటారు. రైతుల నుంచి కె.రఘు, కుమారరాజు, రామరాజు (ఏపీఐఐసీ ఛైర్మన్‌), శ్రీకాంత్‌.. ఎగుమతిదారుల నుంచి కె.ఆనంద్, ఆనంద్‌కుమార్, ఎన్‌.వెంకట్, డి.దిలీప్‌.. హేచరీల ప్రతినిధులుగా పీవీబీ కుమార్, ఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, ఫీడ్‌ మిల్లుల తరఫున సుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉంటారు. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించి రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి చంద్రబాబు సూచించారు.

ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మళ్లీ సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులున్నారని.. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. ఇది ఊహించని సమస్య అని.. ఈ సమస్య పై రైతులు ఓపికగా ఉండాలన్నారు.

ఆక్వా ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాల భారాన్ని రైతుల పైకి నెట్టకుండా వ్యాపారులు, ఫీడ్‌మిల్లులు, హేచరీలు బాధ్యత తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రొయ్యకు స్థానిక వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ పరిస్థితి చక్కబడే వరకు రైతుకు ధైర్యం కల్పించాలని.. రైతుకు గిట్టుబాటు రేటు ఇచ్చేలా వ్యాపారులు చూడాలి అన్నారు. కొంతమంది రైతులు క్రాప్ హాలిడే అని ప్రకటించడంతో.. ఈ అంశంపైనా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చించనుంది.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

cbn | trump | tarriffs | trump tariffs | trump tariffs india | trump tariffs news | trump tariff war | donald trump tariffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment