Rajasthan CM: లేట్ అయినా లేటెస్టుగా..రాజస్థాన్ లోనూ బీజేపీ కొత్త ఫార్ములా.. 

మూడు రాష్ట్రాలలో గెలుపు తరువాత ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ ఆలస్యం చేసినా.. షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో సీఎంలు గా కొత్తవారిని ఎంపిక చేసిన బీజేపీ అదే తరహాలో రాజస్థాన్ ముఖ్యమంత్రిని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. 

New Update
Rajasthan CM: లేట్ అయినా లేటెస్టుగా..రాజస్థాన్ లోనూ బీజేపీ కొత్త ఫార్ములా.. 

Rajasthan CM: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పదిరోజులు అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఐదు రోజులు కావస్తోంది. బీజేపీ గెలిచిన ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో మాత్రం ముఖ్యమంత్రుల ఎంపిక ఇప్పటికీ పూర్తిగా కాలేదు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో ముఖ్యమంత్రులను ప్రకటించింది బీజేపీ. ఇక మిగిలింది రాజస్థాన్. ఇక్కడ కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో వచ్చినట్టుగానే ఇక్కడ కూడా షాకింగ్ నిర్ణయాలు వస్తాయని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. రాజస్థాన్ లో కూడా అదే ఫార్ములా అనుసరించే అవకాశం ఉందని లెక్క వేస్తున్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీ నుంచి సీఎం వచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. అలాగే మహిళా ముఖ్యమంత్రి వచ్చే ఛాన్స్ కూడా ఉందని అంచనా. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వసుంధర రాజే కి అవకాశం దొరకదని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఎందుకంటే.. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా కొత్తవారికే అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. 

బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం జరిగే శాసనసభా పక్ష సమావేశంలో కొత్త సీఎం(Rajasthan CM) పేరును ప్రకటించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన-మధ్యప్రదేశ్‌లో OBC ముఖ్యమంత్రులను తీసుకు వచ్చింది బీజేపీ. కాబట్టి, ఇప్పుడు రాజస్థాన్ బాధ్యతను సాధారణ వర్గం (బ్రాహ్మణ, వైశ్య, రాజ్‌పుత్) నుంచి లేదా ఏ మహిళా నాయకురాలికైనా  బిజెపి తన ప్రధాన ఓటు బ్యాంకుకు అప్పగించవచ్చు. ఎమ్మెల్యే కాని వ్యక్తిని  బహుశా ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేదని కూడా  రెండు రాష్ట్రాల సరళి సూచిస్తోంది. రెండు రాష్ట్రాల నమూనాతో కొత్త వారికి ఆశలు పెరిగాయి. దీంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పెరిగింది. 

రాజస్థాన్‌లో(Rajasthan CM) కొత్త వారిని ముఖ్యమంత్రిని చేసే సూచనలు ఎన్నికలకు ముందే కనిపించాయి. సీఎం ఎవరో  ప్రకటించకుండానే తొలిసారిగా బీజేపీ ప్రధాని మోదీని ముందు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పటి వరకు బీజేపీ సీఎం ఎవరనేది  ముందుగానే ప్రకటిస్తున్నప్పటికీ, రాజస్థాన్‌లో సమిష్టి నాయకత్వంలో మోదీని ప్రచారంలో ముందు నిలుపుతూ ఎన్నికల్లో పోటీ చేసింది.

Also Read: ప్రజా దర్బార్ పేరు మార్పు..ఇకమీదట రెండు రోజులు మాత్రమే

గతంలో భైరాన్ సింగ్ షెకావత్ నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. ఆయన సీఎం అభ్యర్థి. . 2003 నుంచి 2018 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వసుంధరనే సిఎం అభ్యర్థిగా ఉండేది. అయితే, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో  కొత్త వారికీ అవకాశం ఇవ్వొచ్చని అనిపిస్తోంది. 

కొత్త వారిని  సీఎం చేసి 20 ఏళ్ల నాటి ఆచార వ్యవహారాలను మార్చేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమవుతోంది. రాజస్థాన్‌లో(Rajasthan CM) సీఎం నాయకత్వ స్థాయిలో బీజేపీ హైకమాండ్ జనరేషన్ షిఫ్ట్ దిశగా పయనిస్తోంది. వసుంధర రాజే 2003 నుంచి రాజస్థాన్‌లో బీజేపీ  సీఎం అభ్యర్థిగా పరిగణిస్తూ వచ్చారు.  ఈసారి కొత్త ముఖాన్ని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ముఖం, ఆచార వ్యవహారాలు, తీరు మారనున్నాయి.

ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా!

రాజస్థాన్‌లో, మధ్యప్రదేశ్ తరహాలో బీజేపీ ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను అనుసరించవచ్చు. ఇందుకోసం సీఎం రేసులో ఉన్నారని భావిస్తున్న నేతలకు అవకాశం కల్పించవచ్చు. అటువంటి పరిస్థితిలో, బాల్కనాథ్, కిరోరి లాల్ మీనా పేర్లు ఈ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. 

మొత్తమ్మీద ఈరోజు బీజేపీ రాజస్థాన్ (Rajasthan CM)కు ముఖ్యమంత్రిని ప్రకటిస్తుంది. ఇప్పటివరకూ గట్టిగా ప్రయత్నాలు చేసిన నేతలు కూడా ఇప్పుడు ఆచి తూచి మాట్లాడుతున్నారు. దాదాపుగా కొత్త వారే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రావచ్చని సంకేతాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విషయం తేలాలంటే మధ్యాహ్నం వరకూ వేచి చూడాల్సిందే. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు