Bigg Boss Telugu 8: నామినేషన్స్ రచ్చ మొదలైంది.. శేఖర్ భాష VS మణికంఠ..! బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు గట్టిగా వాదించుకున్నారు. సీరియల్ నటి ప్రేరణ- సోనియా, మణికంఠ - శేఖర్ భాష మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి. By Archana 03 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదటి రోజు చాలా ఆసక్తికరంగా సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాగ మణికంఠ, ఆకుల సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, విష్ణు ప్రియ, పృధ్వీ రాజ్ ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. అలాగే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచిన నిఖిల్, యష్మీ, నైనిక బిగ్ బాస్ ఇంటి చీఫ్స్ గా సెలెక్ట్ అయ్యారు. అయితే సీజన్ 8 లో ట్విస్టులు, టర్న్స్ లిమిట్ లెస్ అని చెప్పినట్లుగా హౌస్ మెట్స్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్ ప్రోమో తాజాగా విడుదలైన ప్రోమోలో ఇంట్లో మొదటి నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుందని షాకిచ్చాడు. ఈ నామినేషన్ ప్రక్రియలో ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరి నామినేట్ చేస్తారు. నామినేట్ అయిన ఆ ఇద్దరిలో ఎవరు ఫైనల్ నామినేషన్స్ వెళ్తారనేది డిసైడ్ చేసేది మాత్రం చీఫ్స్ ఎన్నికైన నిఖిల్, యష్మీ, నైనికా అన్నట్లుగా ప్రోమోలో చూపించారు. ఇక ఈ ప్రక్రియలో సోనియా బేబక్క, ప్రేరణను నామినేట్ చేసింది. దీంతో సోనియా, ప్రేరణకు మధ్య పెద్ద గొడవ జరిగినట్లుగా ప్రోమోలో తెలుస్తోంది. అలాగే మణికంఠ, శేఖర్ భాష మధ్య వాగ్వాదం జరిగినట్లుగా కనిపించింది. ప్రోమోలో అయితే కంటెస్టెంట్స్ ఫుల్ ఫైర్ మీద ఉన్నట్లుగా కనిపించింది.. ఇక మరి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి. Also Read: Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచిన అర్జున్.. మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ - Rtvlive.com #bigg-boss-telugu-8-promo సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి