Chittoor: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన 150 కుటుంబాలు..!

చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నాయకుడు పసుపుల కేశవ మూర్తితో సహా 100 కుటుంబాలు వైసీపీలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

New Update
Chittoor: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన 150 కుటుంబాలు..!

Chittoor: చిత్తూరు జిల్లా పుంగనూరులో సుమారు 150 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీ నాయకుడు పసుపుల కేశవ మూర్తితో సహా 100 కుటుంబాలు అధికార పార్టీలో చేరాయి. అదే విధంగా పుంగనూరు లోని నక్కబండకు చెందిన 30 కుటుంబాలు..మున్సిపాలిటీ పరిధిలో మరో 20 కుటుంబాలు వైసీపీ గూటికి చేరుకున్నాయి. పార్టీ కండువా కప్పి అందరినీ పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Also Read: ముద్రగడ ఒక పెద్ద దరిద్రం.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న కేశవ మూర్తి, వారి అనుచరులు పార్టీలో చేరడం సంతోషమన్నారు. అందరూ కలిసి మెలసి వైసీపీకి భారీ మెజారిటీ అందించాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి అందరినీ ఆకర్షిస్తున్నాయని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు