Andhra Pradesh : గుంటూరు జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్
AP: గుంటూరు జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు తమ హవా చూపించారు. కాగా రాజధాని అంశం గుంటూరు జిల్లాలో వైసీపీ, జగన్ ను దెబ్బసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
Guntur : గుంటూరు జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాల్లో కూటమి (Alliance) అభ్యర్థులు తమ హవా చూపించారు. కాగా రాజధాని (Capital) అంశం గుంటూరు జిల్లాలో వైసీపీ, జగన్ (YS Jagan) ను దెబ్బసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
Aghori: చంచల్గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్గూడ జైలుకు తరలించి.. ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..
ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్కు పంపించారు.
లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.