Bala Krishna: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ..ఏం మాట్లాడుకున్నారంటే? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో సినీ నటులు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి వీరిద్దరూ పుష్పగుచ్ఛం అందజేసి ఫొటోలు దిగారు. By Jyoshna Sappogula 30 Dec 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bala Krishna Met CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి వరుసగా శుభాకాంక్షలు తెలపుతున్నారు సినీ సెలబ్రిటీలు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక టాలీవుడ్ నుండి మొదటిగా కలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో కలిసిన చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎన్నికయినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆ తరువాత నేడు సీఎం రేవంత్రెడ్డిని టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్లోని సీఎం నివాసంలో నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, సినీ నటులు నందమూరి బాలకృష్ణ(Bala Krishna) తన చిన్న అల్లుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణకి ముందు నుంచి మంచి సంబంధాలు ఉండడంతో వీరిద్దరూ కలిసి కాసేపు చర్చించుకున్నారు. అంతేకాకుండా, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu) సైతం తన తల్లిదండ్రులతో తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను కలుస్తున్నారు. అయితే, త్వరలోనే టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అపాయింట్ మెంట్ ను కూడా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. Also Read: ఆర్జీవీ తల నరుకుతానన్న కొలికిపుడి కోసం ఏపీ సీఐడీ వేట.. నేరుగా ఇంటికి వెళ్లి..! #cm-revanth-reddy #bala-krishna సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి