AV Subba Reddy: అళ్ళగడ్డ సీటు అఖిలప్రియకు ఇస్తే అంతే..! ఏవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

పార్టీపై వున్న గౌరవంతోనే ఆళ్లగడ్డ సభకు వెళ్లలేదన్నారు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి. అఖిలప్రియ అల్టీమేటాలకు, బెదిరింపులకు తాను భయపడే రకం కాదన్నారు. అళ్ళగడ్డ సీటు అఖిలప్రియకు తప్ప భూమా కుటుంబంలో ఎవరికి ఇచ్చిన సపోర్ట్ చేస్తానని తెలిపారు.

New Update
AV Subba Reddy: అళ్ళగడ్డ సీటు అఖిలప్రియకు ఇస్తే అంతే..! ఏవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

AV Subba Reddy: కేవలం పార్టీపై వున్న గౌరవంతోనే ఆళ్లగడ్డ సభకు వెళ్లలేదన్నారు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అంతే తప్ప అఖిలప్రియ అల్టీమేటాలకు, బెదిరింపులకు తాను భయపడే రకం కాదన్నారు. టీడీపీ పెద్దలు నా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేయడంతోనే ఒక మెట్టు తగ్గి చంద్రబాబు సభకు గైర్హాజరు అయ్యానన్నారు. తాను పుట్టి పెరిగింది అళ్ళగడ్డ లోనేనని..తన సొంతూరికి వెళితే అపేది ఎవరని ప్రశ్నించారు.

Also Read: ‘కేశినేని కౌన్ కిస్కా గొట్టం, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి’ ఇందుకోసమే నానికి టిక్కెట్ ఇచ్చారు..

ఈ క్రమంలోనే ఆళ్లగడ్డ సీటు గురించి ఆయన మాట్లాడారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని తనకు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఉందని, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ నుండి అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే, ఆళ్లగడ్డ సీటు గురించి చంద్రబాబు చెవిలో చెప్పారని అఖిలప్రియ చెప్పడం విడ్డూరంగా ఉందని ఏవీ సుబ్బారెడ్డి కామెంట్స్ చేశారు.

Also Read: ‘ కాపు, బలిజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు’.. ఓవి.రమణ కీలక వ్యాఖ్యలు

అళ్ళగడ్డ టిక్కెట్ అఖిలప్రియకు తప్ప భూమా కుటుంబంలో ఎవరికి ఇచ్చిన సపోర్ట్ చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో చంద్రబాబు సభ అందరి సహకారంతో ‌జయప్రదం అయిందని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కావాలని..ఆయన వస్తేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని వ్యాఖ్యనించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు