AP Elections: ఇలాంటి దాడులకు భయపడను: అంబటి

నిన్న తెలంగాణలో తనపై జరిగిన యాక్సిడెంట్‌కు, తర్వాత జరిగిన దాడికి సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

New Update
Andhra Pradesh: పవన్‌కు అది అలవాటే.. మంత్రి అంబటి సెన్సేషనల్ కామెంట్స్..!

ఇటీవల తన మీద జరిగిన దాడిపై ఆర్టీవీతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం కోసం వెళ్ళానని తెలిపారు. కారు ప్రమాదం జరిగింది కానీ ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. కానీ బస చేసిన హోటల్‌లో టీడీపీ కార్యకర్తలు తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారని అంబటి చెప్పారు. నన్ను వేసేస్తాం... అంటూ పచ్చి బూతులు మాట్లాడారని చెప్పారు. చందాలు వేసుకుని తనను లేపేస్తాం.. అంటూ మాట్లాడారని మంత్రి తెలిపారు. గతంలో ఇదే ఖమ్మంలో ఒక సామాజిక వర్గం వారు మీటింగ్ పెట్టుకుని రూ.50 లక్షలు చందాలు వేసుకుని తన మీద దాడులు చేయాలని మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

ఇలాంటి దాడులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అంబటి తెలిపారు. ఇదే కుల అహంకారంతో గతంలో వంగవీటి రంగాను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి దాడులకు తాను భయపడే వ్యక్తిని కాదని తేల్చిచెప్పారు. తాను చేతులు కట్టుకుని కూర్చొనే రకం కాదని వార్నింగ్‌ ఇచ్చారు. నిన్న జరిగిన యాక్సిడెంట్‌ కు తన మీద జరిగిన దాడికి సంబంధం ఉందనే అనుమానం కలుగుతుందని అంబటి ఆరోపించారు. దీని మీద విచారణ జరపాలని పోలీసులను ఆయన కోరారు. ఇప్పటికే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారని మంత్రి చెప్పారు.

చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను సరెండర్ చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు

ఈ కేసులో ఆగుగురిని అరెస్ట్ చేశారని అంబటి తెలిపారు. గన్ మెన్ లేకపోతే తన పరిస్థితి ఏంటి..? అని అన్నారు. ఇది కుట్ర ప్రకారం జరిగిన దాడేనని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. బెయిల్ కోసం చంద్రబాబు ఆరోగ్య సమస్యలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. జైల్లో భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ రావడానికి ఒకే అవకాశం ఉందన్నారు. అది చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను సరెండర్ చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన ధ్వజమెత్తారు. అప్పుడు చంద్రబాబుకు తప్పనిసరిగా బెయిల్ వస్తుందని అంబటి జోస్యం చెప్పారు.

ఇది కూడా చదవండి:  మద్యం మత్తులో కొడుకు ఘాతుకం… కన్నతల్లిని కడతేర్చిన కసాయి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

అమరావతికి మరో 40 వేల ఎకరాలు.. మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి, గుంటూరు, విజ‌య‌వాడ‌ను కలిపి మెగా సిటీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన!

అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై మంత్రి నారాయణ స్పందించారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మంగ‌ళ‌గిరి,తాడేప‌ల్లి,గుంటూరు,విజ‌య‌వాడ‌ను క‌లిపి మెగాసిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

New Update
AP Minister Narayana Over Amaravathi

AP Minister Narayana Over Amaravathi

అమ‌రావ‌తిలో మ‌రోసారి భూస‌మీక‌ర‌ణ‌పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని మంత్రి నారాయ‌ణ‌ ప్రకటించారు. అమరావతి విస్తరణకు మరో 40 వేల ఎకరాలకు పైగా భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వస్తున్న వార్తలపై స్పందించారు. ఐదువేల ఎక‌రాల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణయించినట్లు చెప్పారు. దానికోసం భూమి అవ‌సరం ఉంద‌న్నారు. అయితే భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు న‌ష్ట‌పోతార‌నే విష‌యాన్ని స్థానిక ఎమ్మెల్యేలు త‌న దృష్టికి తీసుకువ‌చ్చిన‌ట్లు మంత్రి చెప్పారు. రాజ‌ధానిలోని అనంత‌వ‌రంలో గ్రావెల్ క్వారీల‌ను మంత్రి నారాయ‌ణ ప‌రిశీలించారు. ఆ త‌ర్వాత మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. మంగ‌ళ‌గిరి,తాడేప‌ల్లి,గుంటూరు,విజ‌య‌వాడ‌ను క‌లిపి త్వ‌ర‌లో మెగాసిటీ ఏర్పాటుచేయాల‌నే ఆలోచ‌న‌తో సీఎం ఉన్నార‌ని మంత్రి తెలిపారు. అందుకే అంత‌ర్జాతీయ స్థాయి విమ‌నాశ్ర‌యం నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు.
ల్యాండ్ ఎక్విజిష‌న్ ద్వారా భూములు తీసుకుంటే కేవ‌లం రిజిస్ట్రేష‌న్ ధ‌ర‌లో రెండున్న‌ర రెట్లు మాత్ర‌మే ఎక్కువ వ‌స్తుంద‌న్నారు. అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతుల‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్నారు. రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ ను కోరుకుంటున్నారని అన్నారు. భూస‌మీక‌ర‌ణ ద్వారా ఎయిర్ పోర్ట్ కోసం ముప్పై వేల ఎక‌రాలు స‌మీక‌రించాల్సి ఉంటుంద‌న్నారు. వీటిలో రైతుల‌కు రిట‌ర్న‌బుట్ ప్లాట్లు ఇవ్వ‌గా మిగిలిన భూముల్లో రోడ్లు, డ్రెయిన్లు, ఇత‌ర మౌళిక వ‌స‌తుల కోసం మ‌రికొన్ని వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉంటుంద‌న్నారు. ఇవ‌న్నీ పోగా ఇంకా ఐదువేల ఎక‌రాలు మాత్ర‌మే మిగులుతుంద‌న్నారు. అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుంద‌ని వివరించారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఎయిర్ పోర్ట్ విష‌యంలో భూస‌మీక‌ర‌ణ లేదా భూసేక‌ర‌ణ అనేది ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసారు. అమ‌రావ‌తి నిర్మాణం కోసం 2015లో కేవ‌లం 58 రోజుల్లోనే రైతులు స్వ‌చ్చందంగా 34 వేల ఎక‌రాలు భూమిని పూలింగ్ ద్వారా ఇచ్చార‌నే విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు.
గ‌త ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో మూడు ముక్క‌లాట ఆడింద‌ని మంత్రి నారాయ‌ణ మండిపడ్డారు. ప‌నులు మ‌ధ్య‌లో నిలిపివేసిన నాటి ప్ర‌భుత్వం.. అప్ప‌టి టెండ‌ర్ల‌ను కూడా ర‌ద్దు చేయ‌క‌పోవ‌డంతో న్యాయ స‌మ‌స్య‌లు రాకుండా వాటిన‌న్నింటిని ప‌రిష్క‌రించాల్సి వ‌చ్చిందన్నారు. దీనికోసం 8 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. అయితే ప్ర‌స్తుతం రాజ‌ధానిలో ప‌నులు ప్రారంభ‌మ‌యిన‌ట్లు మంత్రి తెలిపారు. మొత్తం 68 పనులకు సంబంధించి 42360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. ఈ ప‌నుల‌న్నీ ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయన్నారు. నిర్మాణానికి సంబంధించి అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీయే కు కేటాయించిందన్నారు. గతంలో అనంతవరం కొండను సీఆర్డీయే కు కేటాయించారన్నారు. అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారన్నారు. అయితే డ్రోన్ స‌ర్వే ద్వారా ఎంత లోతు వ‌ర‌కూ తవ్వార‌నే దానిపై స్ప‌ష్ట‌త తీసుకుంటామ‌న్నారు. ఇక్క‌డ ఖాళీగా ఉన్న భూమిని కూడా ఏదొక అవ‌స‌రానికి ఉప‌యోగించాల‌ని చూస్తున్నామ‌న్నారు. 

మూడేళ్ల‌లో అమ‌రావ‌తి పూర్తి

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయ‌న్నారు. నిర్ధిష్ట కాల‌ప‌రిమితితో పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామ‌ని నారాయణ వివరించారు. ఏడాదిలో అధికారుల నివాస భ‌వ‌నాలు పూర్తి చేస్తామ‌న్నారు. ఏడాదిన్న‌ర‌లో ట్రంక్ రోడ్లు, రెండున్న‌రేళ్ల‌లో లేఅవుట్ రోడ్లు, మూడేళ్ల‌లో ఐకానిక్ భ‌వ‌నాలు పూర్తి చేస్తామ‌ని చెప్పారు.
(telugu-news | telugu breaking news | amaravathi | amaravathi crda)
Advertisment
Advertisment
Advertisment