AP: బొత్స గారు.. భలే జోకులేస్తున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు..!

పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారంటూ వైసీపీ నేత బొత్సకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శకతకు పాతరేసిందే వైసీపీ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దంటూ ఆయన పోస్ట్ చేశారు.

New Update
AP: బొత్స గారు.. భలే జోకులేస్తున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు..!

Kinjarapu Atchannaidu: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ ముఖ్య నేతలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని వైసీపీ కీలక నేత బొత్స సూచిస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ పై టీడీపీ నేతలు విమర్శల దాడికి దిగారు.

Also Read: ఆవేశపడకు బొత్సా.. అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు : అమర్నాథ్ రెడ్డి

తాజాగా, మంత్రి అచ్చెన్నాయుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ విధంగా ట్వీట్ చేశారు.' భలే జోకులేస్తున్నారు బొత్స గారు.. పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ..? పారదర్శకతకు పాతరేసిందే మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు.. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు'.. అంటూ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు