Zodiac Signs: ఈ 4 రాశుల వారిని అందరు ఇష్టపడతారు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరి రాశిచక్రాలు వారి గుణాలను నిర్ణయిస్తాయి. తమ చుట్టూ ఉన్నవారిలో తామే అత్యంత శక్తిమంతులమని ధనుస్సు,మేషం,మిథునం, సింహం రాశులవారు అనుకుంటారని పండితులు చెబుతున్నారు.అయితే ఈ రాశుల వారి స్వలాభాలు ఎలా ఉంటాయో చూద్దాం.

New Update
Zodiac Signs: ఈ 4 రాశుల వారిని అందరు ఇష్టపడతారు!

ధనుస్సు: ధనుస్సు రాశివారు ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎవరిపైనా ఆధారపడేవారు కాదు. తమంతట తాముగా ఏదైనా చేయగలమనే ఆలోచన వారికి ఎప్పుడూ ఉంటుంది. ఏ రంగం వారికి సరైనదో, ఏ రంగంలో విజయం సాధించవచ్చో విశ్లేషించి నిర్ణయిస్తారు. వారు సమాజంలో కూడా అత్యుత్తమ వ్యక్తులుగా ఎల్లప్పుడూ గుర్తింపు పొందుతారు.

మేషం: మేషరాశి వారు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏ పనినైనా పర్ఫెక్ట్ గా పూర్తి చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది. వారు తమ బాధ్యతను ఎవరికీ వదిలిపెట్టరు. అందుకే వారికి సమాజంలో గౌరవం ఎక్కువ.

మిథునం: మిథునరాశి స్థానికులు సహజమైన వాగ్ధాటి కలిగి ఉంటారు. ఫలితంగా తమ మనసులోని మాటను నిస్సంకోచంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇది వారి సామాజిక వర్గాన్ని పెద్దదిగా చేస్తుంది. మరియు వారు అవసరమైనప్పుడు కరుణ మరియు దయ చూపుతారు.

సింహం: అగ్ని రాశి కావడంతో సింహరాశిని సమాజం చాలా శక్తివంతంగా గుర్తిస్తుంది. గొప్ప నాయకత్వ లక్షణాలతో ఏదైనా సులభంగా చేయగల సామర్థ్యం వీరికి ఉంది. వారి సాహసాలను అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ విఫలం కావద్దు.

Also Read: జీలకర్రను ఇలా వాడితే మీ కడుపు నొప్పి ఇట్టే మాయమవుతుంది

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment