Assam: భారీ వర్షాలతో అతలాకుతలమైన అస్సాం!

అసోం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆరున్నర లక్షల మంది వరదల బారిన పడ్డారు.బ్రహ్మపుత్ర దాని ఉపనదులకు వరదలు భారీగా వచ్చి చేరటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి సహాయక శిబిరాలలోని నిరాశ్రయులను సీఎం హిమంత బిస్వా పరామర్శించారు.

New Update
Assam: భారీ వర్షాలతో అతలాకుతలమైన అస్సాం!

Assam Floods: ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో గత కొన్ని రోజులుగా కురస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. బ్రహ్మపుత్ర  దాని ఉపనదులతో సహా ప్రధాన నదులకు వరదలు పోటేత్తాయి. ఈ వరదలకు సుమారు ఆరున్నర లక్షల మంది పైగా నిరాశ్రయులైయారు.

నేషనల్,స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గోలాఘాట్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శించారు.

గుజరాత్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా జునాగఢ్ జిల్లాలోని 30 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. జునాగఢ్ జిల్లా వండలి గ్రామంలో 24 గంటల్లో 36.1 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయమైయాయి.

Also Read: గతంలో కూడా హత్రాస్ లాంటి అనేక విషాదాలు.. వందలాదిగా మరణాలు.. లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment