Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పంజా విసిరేనా?

AP: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేదానికి మరికొన్ని గంటల్లో తెర పడనుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. పవన్ కళ్యాణ్ ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతారా అనే ఉత్కంఠ నెలకొంది.

New Update
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పంజా విసిరేనా?

Pawan Kalyan: ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెర పడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కాగా దేశం చూపంతా పిఠాపురం పైనే ఉంది. అందరి నోట పవన్ మాట వినిపిస్తోంది. పవన్‌ గెలుపుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పిఠాపురంలో 18 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. పిఠాపురంలో ఎన్నడూలేని విధంగా 86.63శాతం పోలింగ్‌ నమోదు అయింది. పవన్‌కు భారీ మెజారిటీ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పవన్ గెలుపుపై భారీగా బెట్టింగులు జరిగాయి.

పవన్‌ గెలిస్తే పిఠాపురానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పవన్‌కు 60వేల మెజార్టీ వస్తుందని టీడీపీ నేత వర్మ అన్నారు. పవన్ గెలుపు వార్త కోసం అభిమానుల ఎదురు చూస్తున్నారు. కాగా వైసీపీ తరఫున వంగా గీత పవన్ కళ్యాణ్ పై పోటీ చేసిన విషయం తెలిసిందే. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు.. గీతకు ఉన్న అనుచరుల బలం ముందు పవన్ కళ్యాణ్ పంజా విసిరి అక్కడ జనసేన జెండా ఎగురవేస్తారా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది

Advertisment
Advertisment
తాజా కథనాలు