YS Sharmila: సీఎం జగన్కు అద్దం పంపించిన షర్మిల.. ఎందుకో తెలుసా? AP: సీఎం జగన్కు షర్మిల అద్దాన్ని గిఫ్ట్గా పంపించారు. అద్దంలో మీకు మీరు కనిపిస్తున్నారా? చంద్రబాబు కనిపిస్తున్నారా ? ఈ అద్దంలో చూస్కోండి అని అన్నారు. కాగా చంద్రబాబు కనుసన్నల్లో తాను పనిచేస్తున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల ఇలా కౌంటర్ ఇచ్చారు. By V.J Reddy 04 May 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి AP PCC Chief YS Sharmila: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా సీఎం జగన్ కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అద్దం గిఫ్ట్ గా పంపించారు. అద్దంలో మీకు మీరు కనిపిస్తున్నారా? చంద్రబాబు కనిపిస్తున్నారా ? ఈ అద్దంలో చూస్కోండి అని అన్నారు. జగన్ మానసిక సంతులన పై ఆందోళన గా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా చంద్రబాబు కను సన్నల్లో షర్మిల పని చేస్తోందని.. చంద్రబాబు చెప్పిన బాటలోనే ఆమె నడుస్తోందని అటు వైసీపీ నేతలు, ఇటు సీఎం జగన్ కూడా ప్రచారాల్లో వ్యాఖ్యలు చేయడంపై షర్మిల ఇలా రియాక్ట్ అయ్యారు. ALSO READ: రైతు బంధుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన మీడియా సమావేశంలో షర్మిల కామెంట్స్.. * సీబీఐ ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరు లేదు. * సీబీఐ ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరు పెట్టాలని సుధాకర్రెడ్డి చూశారు. * జగన్ బయటపడాలంటే ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరు పెట్టాలని చూశారు. * జగన్ సీఎం అయ్యాక సుధాకర్రెడ్డికి అదనపు అడ్వకేటు పదవి వచ్చింది. * జగన్ ఆదేశాలు లేకపోతే సుధాకర్రెడ్డికి ఏఏజీ పదవి వచ్చేదా?. * వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ చేయాలని గతంలో జగన్ కోరారు. * సీఎం అయ్యాకం సీబీఐ విచారణ అక్కర్లేదని జగన్ చెప్పారు. * ఏ ఆధారాలతో చంద్రబాబుతో కలిసానని చెబుతున్నారు?. * చంద్రబాబు చెబితేనే కాంగ్రెస్లో చేరానని చెబుతున్నారు. * చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా? #cm-jagan #ys-sharmila సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి