కోటంరెడ్డి గెలుపే లక్ష్యంగా.. సతీమణి, కుమార్తెల ఇంటింటి ప్రచారం! నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి సుజితమ్మ, కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇంటింటికీ తిరుగుతూ శ్రీధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. By Nikhil 19 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచర్ల గ్రామంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ, కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు. నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు రూరల్ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. #kotamreddy-sridhar-reddy #ap-elections-2024 సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి