Jagan Manifesto: టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో.. రేపే విడుదల!

రేపే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్‌ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్ల లక్ష్యంగా మేనిఫెస్టో ఉండే ఛాన్స్ ఉంది.

New Update
BREAKING : ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి జగన్‌ గుడ్‌న్యూస్.. వారిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు!

YCP Manifesto: సిద్ధం సభలు ముగిశాయి. జగన్‌ మేనిఫెస్టో ప్రకటిస్తారని అంతా భావించగా.. వైసీపీ అధినేత మాత్రం ఆ పని చేయలేదు. ఎందుకంటే మేనిఫెస్టోకు ఆయన వేరే ముహూర్తం ముందుగానే అనుకున్నట్టు అర్థమవుతుంది. రేపు(మార్చి 12) ఆవివర్భావ దినోత్సవం. అందుకే రేపు మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని జగన్‌ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షించిన జగన్‌ ఈ సారి అందులో ఏం పెట్టబోతున్నరాన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీడీపీకి ధీటుగా జగన్‌ మేనిఫెస్టో:
రేపే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు సీఎం జగన్. టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. రైతులు, మహిళలు టార్గెట్‌గా కొత్త పథకాలు ఉండనున్నాయి. ఏపీ ఎన్నికలపై తెలంగాణ పథకాల ప్రభావం పడింది. ఆరు గ్యారంటీల తరహాలో టీడీపీ, వైసీపీ మేనిఫెస్టో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. కూటమికి ధీటుగా కొత్త పథకాలతో జగన్‌ రాబోతున్నారని సమాచారం.

అద్దంకి సభలో జగన్‌ కీలక వ్యాఖ్యలు:
ఆదివారం అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరిగిన బహిరంగ సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని మరోసారి చెప్పారు జగన్‌. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నానన్నారు. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామన్నారు. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేస్తే పేదరికపు సంకెళ్లు తెంచుకుని రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు వస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి పల్లెకు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తోందని, 175/175 అసెంబ్లీ సీట్లు, 25/25 పార్లమెంట్ సీట్లు గెలుచుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు జగన్. వెనుకబడిన వర్గాల ప్రజలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించి సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అని తెలిపారు.

Also Read: స్టాక్ మార్కెట్లో 16 కోట్ల మంది.. ఏ రాష్టం నుంచి ఎక్కువగా ఉన్నారంటే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు