Anna Rambabu : వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కేసు నమోదు అయింది. ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్‌ అభివృద్ధి పనుల్లో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ మీనా.. దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు.

New Update
Anna Rambabu : వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Anna Rambabu : గిద్దలూరు(Giddalur) వైసీపీ(YCP) ఎమ్మెల్యే అన్నా రాంబాబు(Anna Rambabu) పై కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్‌(Election Code) ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీస్ అధికారులు. ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్‌ అభివృద్ధి పనుల్లో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్‌ అధికారి సబ్‌ కలెక్టర్ రాహుల్‌ మీనా.. ఎమ్మెల్యేకు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.

ALSO READ: జగన్ కు బిగ్ షాక్.. పులివెందుల నుంచి పోటీలో వైఎస్ సునీత?

ఇటీవల ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై కూడా

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం అనుమతి లేకుండా రాచమల్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏపీ(AP) లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున..  కోడ్‌ ఉల్లంఘించారని పోలీసులకు ప్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఫిర్యాదు అందింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు.

మరో వైసీపీ ఎమ్మెల్యే..

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై పలమనేరు ఎమ్మెల్యేపై ఈసీ(Election Commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. పదో తరగతి విద్యార్థులకు సోమవారం ప్యాడ్‌లను పలమనేరు ఎమ్మెల్యే నల్లప్పగారి వెంకటేగౌడ అందించారు. ఈ క్రమంలో ఆయనకు ఈసీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections 2024) కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలను ప్రలోభానికి గురి చేయవద్దని రాజకీయ నాయకులు ఈసీ హెచ్చరించిన విషయం తెలిసిందే. 

పంచడం తప్పే..

ఎన్నికల్లో కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రజలకు మభ్యపెట్టేందుకు డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, బహుమతులు ఇవ్వడం వంటివి నేరం. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో సోమవారం నాటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు ప్యాడ్ లు, పెన్నులను అందించారు. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలా పంచడం నేరం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్యాడ్ లను పంచాడన్న  వ్యతిరేకించిన కొందరు ప్రతిపక్ష నేతలు ఈసీ కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ కు దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం

Advertisment
Advertisment
తాజా కథనాలు