CM Jagan: చంద్రబాబు అరెస్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పోలీసులు అరెస్ట్‌ చేశారని అన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారని.. అందుకే చంద్రబాబు జైలులో 52 రోజులు ఉన్నారని వెల్లడించారు.

New Update
CM Jagan: చంద్రబాబు అరెస్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan: ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పోలీసులు అరెస్ట్‌ చేశారని అన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారని.. అందుకే చంద్రబాబు జైలులో 52 రోజులు ఉన్నారని వెల్లడించారు. ఎన్నికల ముందు ఎవరు అపోజిషన్‌ నేతను అరెస్ట్‌ చేయాలని అనుకోరని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే అరెస్ట్‌ అయ్యారని సీఎం జగన్ అన్నారు.

ఇది కూడా చదవండి: త్వరలో కేసీఆర్ సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ మా కుటుంబాన్ని విభజించింది..

మా ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. కొంతమంది స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది. చివరి దశలో మార్పులు చేసి గందరగోళం సృష్టించే కన్నా.. ముందుగానే నిర్ణయిస్తున్నాం. కాంగ్రెస్‌ ఎప్పుడూ డర్టీ గేమ్‌ ఆడుతూ ఉంటుంది. ఏపీని అన్యాయంగా విభజించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి పాలన చేయాలనుకుంది. మా కుటుంబాన్ని కూడా అలానే విభజించారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయినప్పుడు.. గతంలో మా చిన్నాన్నకు మంత్రి పదివి ఇచ్చారు. ఆ తర్వాత మాకు పోటీగా బరిలోకి దింపారు. వాళ్లు పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి అప్పగించారు. కానీ దేవుడే అధికారం ఇస్తాడు. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు.

విపక్షాలు పథకాల గురించి మాట్లాడవు..

‘మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను. ఇదే మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత. ప్రతి 2వేల జనాభాకు ఓ గ్రామ సచివాలయాన్ని నిర్మించాం. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో విషయాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు సంక్షేమ పథకాల గురించి.. వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు. ఇదే బడ్జెట్‌ గతంలో కూడా ఉంది..ఇప్పుడూ కూడా ఉంది. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు.

పేదరిక నిర్మూలనకు చదువే మార్గం

పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. నాయకులు వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు. పేదరికాన్ని తొలగించాలంటే చదువుపై పెట్టుబడి పెట్టడం తప్ప మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం బోధించకూడదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను విమర్శించేముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి. పేదలు తెలుగు మీడియం చదివితే.. ధనిక పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. నాణ్యమైన విద్య ప్రతీ ఒక్కరి హక్కు కావాలి అంటూ సీఎం జగన్ మాట్లాడారు.

ఇది కూడా చదవండి:  కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు