తుఫాన్ సహాయ కార్యక్రమాలపై అధికారులతో ఏపీ సీఎం జగన్ భేటీ! ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలను వెంటనే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. By Bhavana 05 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్ల పైనే నీరు నిలిచిపోయి నదులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ పరిస్థితులు గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు- కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్,సగం సముద్రంలో ఉందని అధికారులు సీఎంకి వివరించారు. చీరాల బాపట్ల మధ్య పయనించి అక్కడ మధ్యాహ్నం 2.30 గంటలకు తీరం దాటనున్నట్లు అధికారులు వివరించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తుఫాన్ ప్రభావం మంగళవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. తిరుపతి,. నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు, తిరుపతి సహా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. తుఫాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ ప్రారంభం కావాలి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. Also read: సీఎం రేసులోకి దూసుకొచ్చిన దామోదర.. ఆయన ప్లస్ పాయింట్లు ఇవే! #cyclone #andhrapradesh #cm-jagan #michaung సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి