Andhra Pradesh : నన్ను రక్షించండి.. లేదంటే చచ్చిపోతాను.. మరో గల్ఫ్ బాధితురాలు.. రూంలో బంధించి..!

ఉభయగోదావరి జిల్లాల్లో గల్ఫ్ దేశాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చెందిన తాటి సంకురమ్మ గల్ఫ్ లో తన పడుతున్న బాధను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ తనను రక్షించాలని వేడుకుంది.

New Update
Andhra Pradesh : నన్ను రక్షించండి.. లేదంటే చచ్చిపోతాను.. మరో గల్ఫ్ బాధితురాలు.. రూంలో బంధించి..!

West Godavari : ఉభయగోదావరి జిల్లాల్లో గల్ఫ్ దేశాల (Gulf Country) బాధితుల సంఖ్య పెరుగుతోంది. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగోళ్ళు అక్కడే చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోషల్ మీడియా (Social Media) ద్వారా తమ వ్యధలను బయటపెడుతున్నారు బాధితులు. ఇటీవలే మంత్రి నారా లోకేష్ చొరవతో సౌదీ నుంచి ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన మెహరున్నీసా స్వస్థలానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లిన సంకురమ్మ అనే బాధితురాలు వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం నుంచి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చెందిన తాటి సంకురమ్మ గల్ఫ్ లో చిక్కుకుపోయింది.  గత కొన్ని నెలలుగా ఆమెకు జీతం ఇవ్వకుండా యజమాని చిత్రహింసలకు గురిచేస్తోన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా రహస్యంగా కుటుంబ సభ్యులకు పంపింది.

Also Read: వయనాడ్‌లో భయంకరమైన పరిస్థితులు.. RTVతో కేరళ వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ..

ఇంట్లో పది మంది ఉంటే తన ఒక్కదానిపైనే పని భారం అంతా మోపుతున్నారని సంకురమ్మ వాపోయింది. తాను ఇంటికి వెళ్లిపోతానని యజమానికి చెబితే గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని, ఏజెంట్ కు చెబితే పట్టించుకోలేదని చెబుతోంది.  కనీసం భోజనం కూడా పెట్టడం లేదని, తనకు ఆరోగ్యం బాలేకపోయినా పట్టించుకోవట్లేదని కన్నీటిపర్యంతం అయింది. తాను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే చనిపోతానని, తనను కాపాడాలని వీడియోలో కోరింది.

ఈ విషయం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు తెలియడంతో సంకురమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కువైట్ లో ఉన్న బాధితురాలు సంకురమ్మతో వీడియో కాల్ లో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు జనసేన (Janasena) ఎమ్మెల్యే బాలరాజు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేస్తామని, ఆందోళన చెందవద్దని సంకురమ్మకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment