Annamayya District : పేలిన గ్యాస్ సిలిండర్.. తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం..! అన్నమయ్య జిల్లా రాయచోటిలో పెను విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఇంట్లో నుంచి పొగలు వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Archana 17 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Gas Cylinder Explosion : అన్నమయ్య జిల్లా (Annamayya District) రాయచోటి పట్టణం తోగట వీధిలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. అసలు వివరాల్లోకి వెళితే.. గ్యాస్ సిలిండర్ పేలుడు రాయచోటి పట్టణం తోగట విధిలో దంపతులు రమాదేవి, రాజా తమ ఇద్దరు పిల్లలు ప్రభు మనోహర్, మన్వితతో నివాసం ఉంటున్నారు. రమాదేవి భర్త రాజా జీవనోపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కువైట్ (Kuwait) కు వెళ్లగా.. రమాదేవి ఇద్దరు పిల్లలను చూసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఇంతలో అనుకోని ప్రమాదం వారిని తిరిగిరాని లోకాలకు పంపింది. గ్యాస్ సిలిండర్ పెళ్లి రమాదేవితో పాటు తన ఇద్దరు పిల్లలు (ప్రభు మనోహర్, మన్విత) ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అప్పటికే ఇంట్లో ఉన్న ముగ్గురు మృతి చెందారు. అయితే ఈ ఘటన పై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణమా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. Also Read: హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. బస్సు కింద నలిగిపోయిన ఆటో #gas-cylinder-explosion #annamayya-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి