Anil Kumar Yadav: రాజకీయాల నుండి తప్పుకుంటా.. అనిల్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్.!

ఆనాడు తన సవాల్‌ను స్వీకరించినట్లైతే ఈనాడు రాజకీయాల నుండి తప్పుకుండేవాడినని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకడు అని తాను అనలేదని అన్నారు. గెలుపోటములు ఎవరికైనా సహజమేనన్నారు.

New Update
Anil Kumar Yadav: రాజకీయాల నుండి తప్పుకుంటా.. అనిల్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్.!

Anil Kumar Yadav: ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గెలిచిన వాళ్ళు ప్రజలకు మంచి చెయ్యాలని.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని.. తామెక్కడికి పారిపోమని అన్నారు. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని కామెంట్స్ చేశారు. లోపాలు సరిదిద్దుకుని మళ్లీ ముందుకు వెళ్తామన్నారు.

Also Read: స్టాలిన్..నవీన్ పట్నాయక్..చంద్రబాబు కొత్త అడుగులు.. మారుతున్న రాజకీయ సంప్రదాయాలు

మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయారు అంటున్నారని.. అదే నిజం అయితే సరిదిద్దుకుంటామని చెప్పుకొచ్చారు. ఓడిపోతే కృంగిపోయి మూలన కూర్చునే పరిస్థితి ఉండదని.. జగన్ (YS Jagan) వెంటే ఉంటాం.. ఆయనతోనే నడుస్తామని పేర్కొన్నారు. అయితే, తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు మంచి పద్దతి కాదని.. ప్రజలు అన్ని చూస్తున్నారని అన్నారు.

Also Read: మా ఓటమికి కారణం పవన్ : వైసీపీ ఎమ్మెల్సీ సంచలన ఇంటర్వ్యూ

ఈ క్రమంలోనే తాను రాజకీయాల నుండి తప్పుకుంటా అని ఛాలెంజ్ చేసానని అయితే, తన సవాల్ ను అవతల వాళ్ళు ఆనాడు స్వీకరించలేదని అన్నారు. ఆనాడు స్వీకరించినట్లు చెప్పి ఉంటే బాగుండేదని .. ఈ రోజు ట్రోల్ చెయ్యడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకడు అని తాను అనలేదన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పదేళ్లు ఎమ్మెల్యేగా గెలవలేదని.. గెలుపోటములు ఎవరికైనా సహజమేనన్నారు. ఈ సారి ఓడిపోయిన వాళ్ళం వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారని చెప్పారు. 

author-image
By Manogna alamuru
New Update
MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ దువ్వాడపై మొత్తానికి వేటు పడింది. గత కొన్ని రోజలుగా వార్తల్లో నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పై ఎట్టకేలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చర్యలు తీసుకున్నారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పినట్లు ఫిర్యాదులు రావడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 

జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే..

పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే దువ్వాడను సస్పండ్ చేశారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్ ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జి పేరాడ తిలక్ కి మద్దతు తెలపమని జగన్ అడిగారు. కానీ దీనికి దువ్వాడ ఒప్పుకోలేదు. దీంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారని చెబుతున్నారు. నాయకుడు చెప్పిన వెంటనే సస్పెన్షన్ ను అమలు చేసింది పార్టీ కేంద్ర కమిటీ.  దీంతో ఇప్పటి వరకు జగనే నా దేవుడు అన్న దువ్వాడ దారెటో అని పార్టీ జనాలు అనుకుంటున్నారు. ఇతని సస్పెన్షన్ తో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా పరిణించాయని..ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాణి హాస్తం వుందని మాట్లాడుకుంటున్నారు. 

 

ap
Mlc Duvvada suspention

 

 

 today-latest-news-in-telugu | duvvada-srinivas | ycp | suspend

Also Read: J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

 

Advertisment
Advertisment
Advertisment