Anganwadis strike in AP:మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగించిన అంగన్వాడీలు

ఏపీ సీఎం జగన్ ఈ నెల 23న అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సందర్బంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లారు..నెలకు పైగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న అంగన్వాడీలు పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.

New Update
Anganwadis strike in AP:మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగించిన అంగన్వాడీలు

Anganwadis strike in AP: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మె వేడి ఇంకా కొనసాగుతోంది. జగన్ సర్కార్ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నెలరోజులకి పైగా ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలా నిరసనలు వ్యక్తం చేస్తున్నాసరే జగన్ సర్కార్ స్పంధించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. అంగన్వాడీలు మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.పూర్తి వివరాల్లోకి వెళితే ..

ALSO READ: సీఎం జగన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగించిన అంగన్వాడీలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)ఈనెల 23న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)వెళ్లారు. అయితే ఉరవకొండ నియోజకవర్గంలో అంగన్వాడి వర్కర్లు ఒక్కసారిగా మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డుకుని, రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అంగన్వాడీలను బలవంతంగా అక్కడినుంచి పక్కకు నెట్టి .. మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని ముందుకు పంపించారు. నెల రోజులకు పైగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

Also Read :  గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!

Also Read :  వీరు పొరపాటున పాలు తాగారో.. పైకి పోవడం ఖాయం

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read :  మాస్ మహారాజ్ 'మాస్ జాతర' షురూ.. మనదే ఇదంతా.!

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

Also Read :  'జైలర్ 2' లోకి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎంట్రీ..!

 

(telugu breaking news | latest-telugu-news | br naidu ttd chairman | today-news-in-telugu | andhra-pradesh-news)

Advertisment
Advertisment
Advertisment