Pawan Kalyan : నాకు సినిమాలే ఇంధనం: పవన్ కల్యాణ్!
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
గంగవరం పోర్టును జగన్ అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించిందన్నారు. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లను అన్నా తమ్ముళ్లతో పోల్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వారిని దండుపాళ్యం బ్యాచ్ అనడం ఏంటన్నారు. విశాఖలో పవన్ హింస సృష్టించాలని చూస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్కు రుషికొండ మీద అంత ప్రేమ ఎందుకొచ్చిందో అర్థం కావడంలేదన్నారు. పవన్ విశాఖలో హింస సృష్టించాలని చూస్తున్నారన్న ఆమె.. అలా జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
విశాఖపట్నంలో బేబీ సినిమాను తలపిస్తున్న ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. మూడు కుటుంబాల్లో కడు విషాదాన్ని మిగిల్చింది. ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయి తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పిదానికి మూడు నిండు జీవితాలు బలైపోయాయి. ఒకే సమయంలో ఇద్దర్ని ప్రేమించిన ఆ అమ్మాయి అందులో నుంచి ఒకర్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అదే సమయంలో మరొకరితోనూ.. ప్రేమను సాగించింది. చివరికి ఈ ట్రయాంగిల్ ప్రేమ ఆమెనే బలితీసుకుంది..
విశాఖలోని గోపాలపట్నంలో జరిగిన ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదంగా ముగిసింది. ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించిన 17ఏళ్ల బాలిక.. ఆ ఇద్దరిలో ఒకరిని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వారితో రిలేషన్షిప్ కొనసాగించడంతో ఈ విషయం భర్తకు తెలిసిపోవడం.. అదే సమమంలో ఇద్దరు ప్రేమికులు ఇంటికి రావడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలుసుకున్న ఇద్దరి ప్రియుల్లో ఒకరు సూసైడ్ చేసుకున్నాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిరిపురంలో సీబీసీఎన్సీ(CBCNC)భూములను పరిశీలించారు. ఈ నేపథ్యంలో CBCNC భూముల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
వైజాగ్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఎన్నికల వేళ షాక్ ఎదురైంది. ఆయనకి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. విశాఖ సౌత్ నుంచి తెలుగు దేశం పార్టీ తరపున గెలిచి వైసీపీలోకి జంప్ చేశారు వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి ఒక వ్యక్తి మీద దాడి చేసిన కేసులో ఏ2గా ఉన్నారు. దీంతో ఈ కేసును విచారించిన విశాఖ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు వాసుపల్లికి 6 నెలల సాధారణ జైలుతో పాటు 5 వేల రూపాయలను జరిమానా విధించింది.
దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు.