AP: 16 మంది పిల్లలకు డయేరియా.. విషయంగా పాప పరిస్థితి..!
విజయనగరం జిల్లా చిట్టంపాడు గ్రామంలో 16 మంది పిల్లలు డయేరియాతో బాధపడుతున్నారు. ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అందులో ఓ పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
విజయనగరం జిల్లా చిట్టంపాడు గ్రామంలో 16 మంది పిల్లలు డయేరియాతో బాధపడుతున్నారు. ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అందులో ఓ పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
విజయనగరం జిల్లాలో చిట్టీల పేరుతో కొందరు అమాయకులు మోసపోయారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే వీధిలో 20 ఏళ్లుగా నివసిస్తున్న ఓ వ్యక్తి ఏకంగా రూ. 3 కోట్లు నమ్మించి మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
ఏపీ సచివాలయ, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16 శాతం హెచ్ఆర్ఏను 24శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు.
విజయనగరం జిల్లా విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రించేందుకు రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టకపోత రానున్న రోజుల్లో యువతకి ముప్పు తప్పదన్నారు. విద్యార్థి దశలోనే డ్రగ్స్ పై అవగాహన ఉండాలన్నారు.
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మొండిచేయి చూపించారంటూ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంటుపై స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని విమర్శలు గుప్పించారు.
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం ఒడిశా తీరంలో ఉన్న చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది
బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది కేంద్రం. బీహార్, ఝార్ఖండ్ తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15000 కోట్లు కేటాయించింది. పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది,
విజయనగరంలో గిరిజనులు ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించారు. తాము సాగు చేస్తున్న భూమికి పోడు పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి శిఖరాల్లో ఉన్న గిరిజన గ్రామాలకి కనీసం మౌలిక సదుపాయాలు లేవని మండిపడుతున్నారు.
విజయనగరం జిల్లా మారిక గ్రామ గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. డోలి మోతలు వలన ప్రాణాలు కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్లు వేయాలని వేడుకుంటున్నారు.