క్షమాపణ చెబితే తిరిగి వస్తారా? ఎవరో ఏదో అంటూ.. పవన్ కు TTD చైర్మన్ కౌంటర్

TTD చైర్మన్, ఈవో తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ స్పందించారు. క్షమాపణ చెబితే చనిపోయిన వారు తిరిగి వస్తారా? అని ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.

New Update
TTD Chairman Over Tirupati Stampede

TTD Chairman Over Tirupati Stampede

TTD చైర్మన్, ఈవో తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ స్పందించారు. క్షమాపణ చెబితే పోయిన వారు తిరిగి వస్తారా? అని ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ రోజు పిఠాపురం పర్యటనలో పవన్‌ మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనపై తాను క్షమాపణ చెప్పానన్నారు. క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అంటూ ఫైర్ అయ్యారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలా రావు, అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అధికారులు తప్పు చేయడంతో.. ప్రజలు సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాధితులకు రూ.25 లక్షల పరిహారం

ఇదిలా ఉంటే.. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ రోజు టీటీడీ పాలకమండలి భేటీ జరిగింది. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారికి కుటుంబాలకు టీటీడీ ప్రగాఢ సంతాపం తెలిపింది. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని తీర్మానించింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ.5 లక్షల చొప్పు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ.2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్‌.. అమెరికాలో ఏం జరుగుతోంది?

తప్పు చేసిన వారిని వదిలిపెట్టం..

ఈ ఘటనపై న్యాయ విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తప్పిదం జరిగింది వాస్తవమని.. తప్పు చేసినవారిని ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. జరిగింది ఓ దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

Also Read: Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్

మిగిలిన 7 రోజులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి ఏరోజుకు ఆరోజే టోకన్లు జారీ చేస్తామన్నారు. వైకుంఠ ద్వార దర్శనంపై సీఎం అభిప్రాయాలపై చర్చిస్తామన్నారు. ఈ ఏడాది పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఇలానే కొనసాగుతాయని తెలిపారు. మృతిచెందిన 6 కుటుంబాల్లోని పిల్లల విద్య ఖర్చులు టీటీడీ భరిస్తుందన్నారు. 

ఇది కూడా చదవండి: Fun Bucket Bhargav: బిగ్ షాక్..! ఫన్‌బకెట్‌ భార్గవకు 20 ఏళ్ల జైలు

 

Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద ఏడుగురు కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన  అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం  క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే పరామర్శ.. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు.  గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. 

telugu-news | latest-news | ntr-district

Advertisment
Advertisment
Advertisment