మిచౌంగ్ తుఫాన్ బీభత్సం..ఐదుగురి మృతి..స్కూళ్లు మూసివేత!
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. విశాఖ, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది.
భారీ సైక్లోన్ మిచౌంగ్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరో గంట వ్యవధిలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరువాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయి.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. సుమారు 150 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు అయ్యాయి.
తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి .రోజంతా వర్షం కురుస్తుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు ముఖ్యగమనిక. నేడు ఏపీ వ్యాప్తంగా పాఠశాలలకు సర్కార్ సెలవు ప్రకటించింది. ఏపీలో మిచైంగ్ తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా నేడు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
మైచౌంగ్ తుఫాన్ భయంకరంగా మారింది. అమెరికాలో వచ్చే తుఫాన్లతో పోల్చినట్లయితే ఇది చిన్నదే. అయినప్పటికీ దీనిప్రభావం తెలుగు రాష్ట్రాలపై బాగానే ఉంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
తిరుమల శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలను ధర్మప్రచారం కోసమే టీటీడీ వినియోగించాలని డిమాండ్ చేశారు. శనివారం తిరుమలలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.