Pastor Praveen Pagadala : రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..కేఏ పాల్ రావడంతో...

రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల  మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ వెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది.

New Update
 Pastor Praveen Pagadala

 Pastor Praveen Pagadala

 Pastor Praveen Pagadala : రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల  మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ ప్రచారకుడు కేఏపాల్ వెళ్లారు. పోస్టుమార్టం గదిలోకి తనను అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే కేఏపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే దేవుడు క్షమించడని హెచ్చరించారు.

 కాగా విజయవాడ  నుంచి హైదరాబాద్ వస్తుండగా కొవ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారు. అయితే ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న క్రైస్తవ సంఘాలు, కేఏపాల్ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. ప్రవీణ్ మృతిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

హైదరాబాద్ కు చెందిన క్రైస్తవ ప్రసంగికుడు అనుమానాస్పద మృతిపై ఏపీ , తెలంగాణలో అలజడి రగిలింది. ఆయన ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు ప్రాథమిక విచారణలో ప్రకటించగా.. కాదు ప్రత్యర్థులు హతమార్చారని క్రైస్తవ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ స్పందించారు. ఘటనసపై సమగ్ర విచారణ జరపాలని సీఎం డీపీజీని ఆదేశించారు. ఈ కేసును పూర్తి సమాచారంతో దర్యాప్తు జరపాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఈ మరణ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: Court Movie Collections: ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే

అసలు ఏం జరిగింది ?


తూ ర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గామన్‌ బ్రిడ్జి రహదారిపై కొంతమూరు నయారా పెట్రోల్‌ బంకు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాస్టర్‌ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీఎహెచ్‌ కాలనీకి చెందిన పగడాల ప్రవీణ్‌కుమార్‌(46) అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికుడిగా ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై వెనుక లగేజీ బ్యాగ్‌ కట్టుకుని రాజ మహేంద్రవరం బయలుదేరారు. రాజమహేంద్రవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని, భార్యకు చెప్పి వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యలో సోమవారం అర్ధరాత్రి కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చే సరికి మోటార్‌సైకిల్‌ అదుపుతప్పి రహదారి నుంచి పల్లపు ప్రాంతానికి పడిపోవడంతో ప్రవీణ్‌కుమార్‌ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మర్నాడు ఉదయం వరకు ఎవరూ గమనించలేదు. మంగళవారం ఉదయం అందిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ప‌రిశీలించారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలించామని, బుల్లెట్‌తో సహా ప్రవీణ్‌కుమార్‌ రహదారి పైనుంచి కిందికి జారిపోవడం, బుల్లెట్‌ ఆయనపై పడిపోవడంతో మృతిచెందినట్టు తెలిపారు. ఈ మేరకు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేం ద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఎస్‌ఐ మనోహర్‌ కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

రాజమండ్రిలో ఉద్రిక్తత


మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాలు నిరసన చేప‌ట్టాయి. ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్ల ఆందోళనలతో రాజమండ్రి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి వద్దకు భారీగా దళిత సంఘాలు,పాస్టర్లు, క్రైస్తవులు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛ‌నీయ‌ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రవీణ్ ఒంటిపై గాయాలున్నాయని… రాడ్డుతో కొట్టినట్టు కనిపిస్తోందని క్రైస్తవ సంఘాల నేతలు చెబుతున్నారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రెండు, మూడు గంటలపాటు రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి ధర్నాను తాత్కాలికంగా విరమింప చేశారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపీ హర్షకుమార్‌, రాజేష్‌ మహాసేనతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలు, రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పాస్టర్లు జాన్‌ వెస్లీ, జేమ్స్‌, విజయరాజు వంటివారితోపాటు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read :  ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates:

Ugadi 2025: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీని అర్థం ఏంటంటే.. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు జరుగుతాయని, ఆదాయం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట.

Ugadi Sri Vishwavasu
Ugadi Sri Vishwavasu Photograph: (Ugadi Sri Vishwavasu)

 

హిందువులు తప్పకుండా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి. ప్రత్యేకమైన ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంటిల్లా పాలిది కొత్త దుస్తులు ధరించి ఈ ఉగాది పండును నిర్వహిస్తారు. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగను ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కొత్త సంవత్సరం మార్చి 30వ తేదీన నిర్వహిస్తారు. అయితే తెలుగు క్యాలెండర్‌లో మొత్తం 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతీ ఏడాది ఒక్కో కొత్త సంవత్సరం వస్తుంది. అయితే ఈసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వస్తోంది.

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

ఈ ఏడాది శుభ ఫలితాలు..

ప్రతీ కొత్త సంవత్సరానికి ఓ అర్థం ఉన్నట్లే.. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి కూడా ఓ అర్థం ఉంది. శ్రీ అనేది పవిత్రత, శుభత, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. విశ్వావసు అంటే ప్రపంచానికి శుభములు అందుతాయని అర్థం. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం శుభాన్ని, ఐశ్వర్యాన్ని అందించే సంవత్సరమని అర్థం. ఈ ఏడాదిలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా మందికి ఎక్కువగా శుభ ఫలితాలు వస్తాయి. 

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయని, చాలా మంది కుటుంబాల్లో సంతోషంగా ఉంటుందట. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం కూడా క్లోజ్ అవుతుందని పండితులు చెబుతున్నారు. క్రోధి నామ సంవత్సరం నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి వెళ్తున్నాం. క్రోధి అంటే కోపం. ఈ ఏడాది ప్రతీ ఒక్కరూ కూడా కోపంగా ఉండటం వంటివి జరిగాయి. కానీ కొత్త ఏడాదిలో అంతా కూడా మంచి జరుగుతుందని, అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

  • Mar 30, 2025 13:54 IST

    IPL 2025: హైదరాబాద్ Vs ఢిల్లీ: విశాఖలో హై వోల్టేజ్ మ్యాచ్!

    ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా నేడు సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు ఉవ్విలూరుతున్నాయి. ముఖ్యంగా గత మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. 

    srh vs dc
    srh vs dc Photograph: (srh vs dc)

     



  • Mar 30, 2025 13:10 IST

    చెప్పులు ధరించి స్టార్ హీరోయిన్ గిరి ప్రదక్షిణ.. నెటిజన్లు ఫైర్

    స్నేహ తన భర్తతో కలిసి అరుణాచలం వెళ్లింది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకుని చేసింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పవిత్రమైన అరుణాచల గిరి ప్రదక్షిణ చెప్పులతో చేయడం ఏంటని అంటున్నారు.

    Snhea viral video



  • Mar 30, 2025 13:10 IST

    Zomato: పండగపూట ఇదేం దరిద్రం.. ఫుడ్‌లో ఉమ్మి వేసిన డెలివరీ బాయ్.. వీడియో వైరల్!

    జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. ముంబై హుమా కంజుమార్గ్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో ఉమ్మివేశాడు. స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్ పై చర్యలు తీసుకుంటామని జోమాటో యాజమాన్యం తెలిపింది.  

    mumbai
    mumbai Photograph: (mumbai)

     



  • Mar 30, 2025 07:52 IST

    Ugadi Awards: త్రివిక్రమ్ సతీమణికి ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మక అవార్డు

    ఏపీ ప్రభుత్వం 202 ఉగాది పురస్కారాలు ప్రకటించింది. విజయవాడలో ఉగాది సందర్భంగా CM చంద్రబాబు ఈ అవార్డులను ఇవ్వనున్నారు. 86 కళారత్న, 116 ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నారు. పృథ్వీరాజ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ భార్య సాయిసౌజన్యకు కళారత్న పురస్కారాలు లభించింది.

    Soujanya Srinivas
    Soujanya Srinivas Photograph: (Soujanya Srinivas)

     



  • Mar 30, 2025 07:52 IST

    తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక.. నేటి నుంచే సన్న బియ్యం పంపిణీ

    తెలంగాణ ప్రభుత్వం నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు.

    CM Revanth
    CM Revanth

     



  • Mar 30, 2025 06:48 IST

    Nubia Neo 3 5G: ఏంటి భయ్యా ఈ అరాచకం.. 12/256జీబీ కొత్త ఫోన్ ఇంత చీపా- వదలొద్దు మావా!

    Nubia Neo 3 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్‌ అయ్యాయి. అందులో Neo 3 5G- 8/128GB ధర రూ.12,000గా, 8/256జీబీ ధర రూ.15000గా ఉంది. Nubia Neo 3 GT ఫోన్ 12/256జీబీ ధర రూ.19000గా ఉంది. వీటిని LAZADAలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.

    Nubia Neo 3 5G, Neo 3 GT gaming smartphones launched
    Nubia Neo 3 5G, Neo 3 GT gaming smartphones launched Photograph: (Nubia Neo 3 5G, Neo 3 GT gaming smartphones launched)

     



  • Mar 30, 2025 06:47 IST

    Horoscope: నేడు ఈ రాశి వారికి అన్నింటా విజయమే!

    మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో వేడుకల్లో మునిగితేలుతారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

     Horoscope
    horoscope

     



Advertisment
Advertisment
Advertisment