RTV Exclusive: రేపు TDP, YCP బయటపెట్టబోయేది ఇదే!

రేపు 12 గంటలకు సంచలన విషయాలను బయటపెడతామని YCP, TDPలు పోటాపోటీగా చేసిన పోస్ట్ లు చర్చనీయాంశమయ్యాయి. RTV వద్ద ఉన్న Exclusive సమాచారం ప్రకారం.. షర్మిలకు జగన్ చేసిన అన్యాయాన్ని TDP.. కౌంటర్ గా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లో అవకతవకలను YCP బయటపెట్టనున్నాయి. 

author-image
By Nikhil
New Update
TDP YCP tweet

రేపు మధ్యాహ్నం 12 గంటలకు సంచలన విషయాలు బయటపెడతామని టీడీపీ, వైసీపీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన పోస్టులు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు Big Expose.. అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బయటపెడతామని ఆ పోస్టులో పేర్కొంది టీడీపీ. దీనికి కౌంటర్ గా.. Big Reveal అంటూ టీడీపీ పోస్ట్ చేసింది. దీంతో ఎవరు ఏం భయటపెట్టబోతున్నారు? రేపు అసలు ఏం జరగబోతోంది? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

 

అయితే.. ఆర్టీవీ వద్ద ఇందుకు సంబంధించిన ఎక్స్‌క్లూజీవ్‌ సమాచారం ఉంది. ఈ సమాచారం ప్రకారం.. జగన్ తన చెల్లి షర్మిలకు చేసిన అన్యాయాన్ని టీడీపీ బయటపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ ఫీజు రీయింబర్స్మెంట్ లో అవకతవకలను తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టనుంది.

ఏపీలో ఏ మాత్రం తగ్గని పొలిటికల్ హీట్..

ఏపీలో ఎన్నికలు ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో ఓ అంశంపై అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మధ్యలో తిరుపతి లడ్డూ వివాదం అయితే రాజకీయాలను కుదిపేసింది. దాదాపు నెల రోజుల పాటు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు ఆదేశాలతో ఈ అంశానికి తాత్కాలిక బ్రేక్ పడింది. టీడీపీ ఆఫీసుపై దాడి అంశం, జెత్వానీ కేసు, మద్యం కుంభకోణం తదితర అంశాలపై నిత్యం ఏదో అంశంపై రాజకీయ రగడ సాగుతూనే ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలి

బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుద్వేల్‌ కు చెందిన బీటెక్ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి బలయ్యాడు.

New Update
Cricket Betting

Cricket Betting

Cricket Betting : బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే బుద్వేల్‌లో చోటు చేసుకుంది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ సీజన్ అంటేనే బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటారు. ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే బెట్టింగ్ దందాలో కోట్లు చేతులు మారతాయి. ఈ బెట్టింగుల ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు డబ్బు పోగోట్టుకొని మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

పవన్ కడా ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్‌ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పరిస్థితిని తట్టుకోలేక ఇంటి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment