/rtv/media/media_files/2025/02/25/jFa0DWJXfmhxGLu4xLJP.jpg)
ఏపీ ఫైబర్నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ప్రవీణ్ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. తాజాగా ఆయనకు ఫైబర్ నెట్ ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
Also read : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పై లోకేష్ ప్రకటన..! ఎప్పటి నుంచంటే...
Also Read : ఏపీలో కుల పిచ్చి.. అప్పటి వరకే టీడీపీతో.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్
జీవీ రెడ్డి రాజీనామా
ఇక ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి నిన్న రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవులకు రాజీనామా చేసినట్లుగా ఆయన ప్రకటించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం .. ఆ తర్వాత ఫైబర్ నెట్ ఎండీ దినేష్కుమార్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also read : ఏపీలో మెగా డీఎస్సీ.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!
Also read : చంద్రబాబుకు హ్యాట్సాఫ్ ..గవర్నర్కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్!