పోసానికి అనారోగ్యం.. రంగంలోకి పూనమ్..

రిమాండ్ ఖైదీగా జైల్లో పోసాని కృష్ణమురళి ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పోసాని ఆరోగ్యంపై సినీ నటి పూనం కౌర్ స్పందించారు. పోసాని ఆరోగ్యం పట్ల కాస్త దిగులుగా ఉందని, ఆయనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

New Update
Poonam Kaur Respond

Poonam Kaur Respond Photograph: (Poonam Kaur Respond)

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కృష్ణ మురళి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. అయితే కృష్ణమురళి అనారోగ్య సమస్యల బారిన పడటంతో వెంటనే అతన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని ఆరోగ్యంపై సినీ నటి పూనం కౌర్ స్పందించారు.

ఇది కూడా చూడండి: SLBC: డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!

అతని ఆరోగ్యం పట్ల బాధపడుతున్నట్లు..

ఏపీ రాజకీయాలు చాలా దరిద్రంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని ఆమె అన్నారు. బలహీనులను అరెస్టు చేయడం పగ తీర్చుకోవడం కోసమేనని అన్నారు. వ్యక్తిగతంగా ఆమె ఎంతో ఇబ్బంది పడ్డారని, అతని ఆరోగ్యం పట్ల కాస్త దిగులుగా ఉందని పూనం తెలిపారు. ఈయనను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో పోసాని పూనం కౌర్‌పై కూడా ఆరోపణలు చేశారు. అతని మాటల వల్ల ఇబ్బంది పడినా కూడా పూనం పోసాని ఆరోగ్యం పట్ల బాధపడుతున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!

ఇదిలా ఉండగా పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించినట్లు ఒప్పకోవడంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిపారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విమర్శలు చేశానని, కావాలనే పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టానని పోసాని వెల్లడించారు. 

ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఉంటూ వైసీపీకి సపోర్ట్ చేశానని పోసాని పోలీసులకు తెలిపారు. పవన్‌ను వ్యక్తిగతంగా దూషించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాట్లాడిన మాటలు అన్ని కూడా సజ్జల కొడుకు భార్గవరెడ్డి సోషల్ మీడియాల్లో వైరల్ చేసేవాడని పోసాని రిమాండ్‌లో వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Viral Video: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది

New Update
Rains

Rains

Ap Rains: నైరుతి,  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అక్కడే కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. 'ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా వచ్చి  24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడుతుంది. బుధవారం, గురువారం అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, చెట్లు క్రింద నిలబడరాదు' అని సూచించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని.. కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

'అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వేడిగాలులు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బుధవారం నాడు 25 మండలాల్లో వేడగాలులు వీస్తాయి. మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ కడప జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా కామవరం 40.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి' అని  కూర్మనాథ్ తెలిపారు.

మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. రానున్న మూడు రోజుల వ్యవధిలో నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Also Read:Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

Also Read: Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్.

ap-weather | AP Weather Alert | AP Weather Latest Update | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today | latest-news | telugu-news | latest telugu news updates | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment