Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ అరెస్ట్?

AP: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో అవినాష్ పీఏ రాఘవ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో అతన్ని అదుపులోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం అవినాష్ పీఏ పరారీలో ఉన్నట్లు సమాచారం.

New Update
MP Avinash Reddy: 66 వేల ఓట్ల ఆధిక్యంలో అవినాష్ రెడ్డి..!

YCP MP Avinash Reddy : వైసీపీకి బిగ్  షాక్ తగిలేలా కనిపిస్తోంది. కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ అవినాష్‌ పీఏ రాఘవ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. పోలీసులకు చిక్కుండా అండర్‌గ్రౌండ్‌లో అవినాష్‌ పీఏ ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ఎంపీ అవినాష్‌ పీఏ అనుచిత పోస్టులు పెట్టాడు. అవినాష్‌ పీఏ అందుబాటులో లేకపోవటంతో తండ్రితో పోలీసులు మాట్లాడారు. కాగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

Also Read :  Vivian Jenna Wilson: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన

Also Read :  Yadadri Temple Name Change: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

వైసీపీ ఎమ్మెల్యేపై కూడా....

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిలో ఎమ్మెల్యేలను సైతం పోలీసులు వదలడం లేదు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ పెద్దలపై, మహిళలు, అలాగే చిన్నారులపై అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. తాటిపర్తి  చంద్రశేఖర్ పై యర్రగొండపాలెంలో కేసు నమోదు అయింది. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్ట్ చేయడంపై టీడీపీ నేతపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కాగా ఒక ఎమ్మెల్యేపై కేసు నమోదు అవ్వడం ఇదే తొలిసారి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lady Aghori- Mark Shankar: పవన్ నీ కొడుకు కోసం పూజలు చేస్తున్నా- అఘోరీ సంచలన వీడియో

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని లేడీ అఘోరీ ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అతడి కోసం పూజలు చేస్తున్నానని పేర్కొంది. పిల్లలందరిపై శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. నా వంతు నేను కృషి చేస్తానని ఓ వీడియో రిలీజ్ చేసింది.

New Update


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలిసిన తర్వాత ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు రియాక్ట్ అయ్యారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరీ పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

త్వరగా కోలుకోవాలి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. మార్క్ శంకర్ తో పాటు మరెంతో మంది చిన్న పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాల నుంచి కూడా మిగతా పిల్లలు కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలందరిపై కాళిమాత ఆశిస్సులు, శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి. 

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

ఈ ప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడి గురించి తాను స్పందించడం వెనుక ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కువగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. అందుకే నేను స్పందిస్తున్నాను. దీనిని రాజకీయ కోణంలో చూడకండి. రాజకీయ బురద చల్లకండి. సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా నేను స్పందిస్తాను. వాళ్ల కుటుంబాలకు ఏమైనా నేను స్పందించి రక్షిస్తాను. 

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

పవన్ కళ్యాణ్ గారు మీరేం బాధపడకండి. మళ్లీ మీ కుమారుడు హ్యాపీగా నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. మీరు సరదాగా మీ కుమారుడితో సమయాన్ని గడిపే రోజులు వస్తాయి. నా వంతు నేను కృషి చేస్తాను. పూజలో కూర్చోబోతున్నాను. మీరేం బాధపడకండి. మీరు సనాతన ధర్మం గురించి పోరాడండి. 

Also Read:  చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

(lady aghori | Pawan Kalyan | pawan kalyan son mark shankar | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment